యాప్నగరం

టెస్ట్ క్రికెట్ ఆతిథ్యానికి ఢిల్లీ దూరం?

ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో మూడో టెస్టు మ్యాచ్ సందర్భంగా లంక ఆటగాళ్లు తీవ్ర ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది.

TNN 5 Dec 2017, 4:53 pm
ఢిల్లీలోని కాలుష్యం కారణంగా మూడో టెస్టులో శ్రీలంక ఆటగాళ్లు ఇబ్బంది పడిన నేపథ్యంలో బీసీసీఐ నుంచి కీలక నిర్ణయం వెలువడింది. 2020 వరకూ ఫిరోజ్‌షా కోట్ల మైదానంలో మళ్లీ టెస్టు మ్యాచ్‌లు నిర్వహించబోవడం లేదు. బీసీసీఐ రొటేషన్ పాలసీలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏటా ఫిబ్రవరి-మార్చి నెలల్లో భారత్‌లో జరిగే క్రికెట్ సిరీస్‌‌లను ఏయే వేదికల్లో నిర్వహించాలనే విషయమై బీసీసీఐ ఓ నిర్ణయానికి వచ్చేసింది. దీంతో 2020 వరకూ ఢిల్లీలో టెస్ట్ మ్యాచ్ నిర్వహించే అవకాశాలు లేవని తెలుస్తోంది.
Samayam Telugu cricket boards rotation policy may keep test cricket away from delhi till 2020
టెస్ట్ క్రికెట్ ఆతిథ్యానికి ఢిల్లీ దూరం?


రొటేషన్ పాలసీలో భాగంగా ఈ నవంబర్లో కోట్ల స్టేడియం ఓ వన్డే, ఓ టెస్ట్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చింది. వచ్చే ఏడాది మ్యాచ్‌లను ఇతర వేదికల్లో నిర్వహిస్తాం. మరుసటి సంవత్సరం కూడా ఇదే పరిస్థితి ఉంది. కోట్ల స్టేడియంలో మరో మ్యాచ్ నిర్వహించడానికి మరింత సమయం పడుతుందని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. శీతాకాలంలో ఢిల్లీలో స్మాగ్ అధికంగా ఉంటోంది. కాలుష్యం తీవ్రంగా ఇబ్బంది పెడుతుండటంతో చలికాలం ఫిరోజ్ షా కోట్ల మైదానంలో టెస్టులు నిర్వహించొద్దని బోర్డు నిర్ణయించినట్లు సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.