యాప్నగరం

మహారాష్ట్ర సీఎంని కలిసిన సచిన్, గవాస్కర్

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేని మంగళవారం భారత దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్ కలిశారు. మర్యాదపూర్వకంగానే ఈ ఇద్దరూ ముఖ్యమంత్రిని కలిసినట్లు తెలుస్తోంది.

Samayam Telugu 24 Dec 2019, 3:28 pm
భారత దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్‌ ఈరోజు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేని కలిశారు. నవంబరు 28న సీఎంగా ఉద్ధవ్ ఠాక్రే బాధ్యతలు చేపట్టగా.. ఈరోజు ముంబయిలోని అతని నివాసం ‘మాతోశ్రీ’ వెళ్లిన ఈ మాజీ క్రికెటర్లు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. భారత్, వెస్టిండీస్ మధ్య ఇటీవల ముగిసిన సిరీస్‌‌కి మ్యాచ్ కామెంటేటర్‌గా సునీల్ గవాస్కర్ వ్యవహరించిన విషయం తెలిసిందే.
Samayam Telugu Sachin Tendulkar meets Uddhav Thackeray


Read More: శ్రీలంక, ఆస్ట్రేలియాతో సిరీస్‌ కోసం భారత్ జట్టు ప్రకటన.. బుమ్రా, ధావన్ రీఎంట్రీ


మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత.. రాజకీయాల్లో గజిబిజి వాతావరణం నెలకొనగా.. వాటన్నింటినీ అధిగమించి ఎట్టకేలకి శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాడు. బీజేపీ ఎత్తుల్ని చిత్తుచేస్తూ శివసేన-ఎన్సీపీ.. కాంగ్రెస్ పర్యవేక్షణలో మహారాష్ట్ర వికాస్ ఆఘాడీ (ఎంవీఏ) ఏర్పడిన విషయం తెలిసిందే. దీంతో.. 2003 నుంచి సీఎం పదవి కోసం నిరీక్షిస్తున్న59 ఏళ్ల ఉద్ధవ్ ఠాక్రే తన కలని నెరవేర్చుకున్నాడు.

Read More: undefined

ఉద్ధవ్ ఠాక్రేని సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్ కలిసిన సమయంలో అతనితో పాటు కుమారులు ఆదిత్య ఠాక్రే, అమిత్‌లు కూడా అక్కడే ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.