యాప్నగరం

ఇషా నేగితో ప్రేమలో రిషబ్ పంత్.. ఫొటోలివే!

టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఓ యువతితో గాఢమైన ప్రేమలో ఉన్నాడు. పంత్ షేర్ చేసిన ఫొటో, చేసిన కామెంట్.. అందుకు అవతలి నుంచి వచ్చిన రెస్పాన్స్ చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతోంది!!

Samayam Telugu 17 Jan 2019, 11:40 pm

ప్రధానాంశాలు:

  • వికెట్ కీపర్ రిషబ్ పంత్ కొత్త ఇన్నింగ్స్..
  • ఇంటీరియర్ డిజైనర్ ఇషా నేగితో ప్రేమలో..
  • ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టులో ఆసక్తికర కామెంట్..
  • మరింత ఆసక్తిగా బదులిచ్చిన ఇషా..
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Pant
టీమిండియా నయా సంచలనం, వికెట్ కీపర్ రిషబ్ పంత్ ప్రేమలో పడ్డాడు. ఎంటర్‌ప్రెన్యూర్‌, ఇంటీరియర్‌ డిజైనర్‌ అయిన ఓ అమ్మాయితో గాఢమైన ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. పంత్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటో చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతోంది. ఫోటోతో పాటు ఈ యంగ్ క్రికెటర్ చేసిన కామెంట్, దానికి ఆ యువతి ఇచ్చిన రిప్లై.. వారిద్దరూ గాఢమైన ప్రేమలో మునిగితేలుతున్నట్లు చెప్పకనే చెబుతున్నాయి.
బుధవారం (జనవరి 16) పంత్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్లో ఓ అమ్మాయితో దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. దీంతో పాటు ఆసక్తికర కామెంట్ కూడా పెట్టాడు. ‘నిన్ను సంతోషంగా ఉంచాలనుకుంటున్నా.. ఎందుకంటే నా సంతోషానికి కారణం నువ్వే’ అని రాసుకొచ్చాడు. ఇషా కూడా అదే ఫొటోను షేర్‌ చేయడం గమనార్హం.

పంత్ పోస్టు చేసిన ఫొటోను షేర్ చేస్తూ ఇషా నేగి చేసిన కామెంట్ మరింత ఆసక్తికరంగా ఉంది. ‘మై మ్యాన్‌, మై సోల్‌మేట్‌, బెస్ట్‌ ఫ్రెండ్‌, లవ్‌ ఆఫ్‌ మై లైఫ్‌..’ అంటూ ఆమె కామెంట్ పెట్టింది. దీంతో వీరిద్దరూ గాఢమైన ప్రేమలో ఉన్నారని అభిమానులు కామెంట్లు గుప్పిస్తున్నారు.


రిషబ్ పంత్‌ షేర్‌ చేసిన ఫొటోలోని యువతి పేరు ఇషా నేగి. ఆమె ఎంటర్‌ప్రెన్యూర్‌, ఇంటీరియర్‌ డిజైనర్‌‌గా పనిచేస్తున్నారు. టెస్టు సిరీస్‌ తర్వాత ఆసీస్‌, న్యూజిలాండ్‌లతో వన్డే సిరీస్‌ల నుంచి విశ్రాంతి లభించిన నేపథ్యంలో ఖాళీ సమయాన్ని పంత్‌ ఆస్వాదిస్తున్నాడు.

ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో పంత్ అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే. కంగారూల గడ్డపై సెంచరీ చేసిన తొలి భారత వికెట్‌ కీపర్‌గా రిషబ్‌ పంత్‌ రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపైనే ఓడించి కొత్త రికార్డు సృష్టించిన కోహ్లీ సేనలో పంత్‌ కీలక పాత్ర పోషించాడు. బ్యాట్‌తోనే కాకుండా వికెట్ల వెనుక స్లెడ్జింగ్‌తోనూ ఆసీస్‌కు దీటుగా బదులిచ్చాడు. దీంతో అభిమానులు ముచ్చటగా అతడిపై ఓ కవిత కూడా రాసి, మైదానంలో ఆలపించారు.

పంత్‌పై అభిమానులు రాసిన కవిత..

ఆసీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో పంత్‌ మొత్తం 350 పరుగులు చేశాడు. సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసినవారిలో రెండో స్థానంలో నిలిచాడు. సిరీస్‌‌లో ఏడు ఇన్నింగ్స్‌లు ఆడిన పంత్.. సెంచరీతో టెస్టు సిరీస్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు.


View this post on Instagram My man, my soulmate, my best friend, the love of my life. @rishabpant A post shared by Įsha Negi 👑 (@ishanegi_) on Jan 16, 2019 at 7:52am PST

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.