భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా సోమవారం అర్ధరాత్రి ముంబయిలో అరెస్టవడం క్రికెట్ వర్గాల్లో కలకలంరేపింది. ఎయిర్పోర్ట్ సమీపంలోని డ్రాగన్ప్లై క్లబ్లో రైనా, సింగర్ గురు రంధవాతో పాటు మొత్తం 34 మందిని ముంబయి పోలీసులు అరెస్ట్ చేశారు. కోవిడ్-19 వ్యాప్తిని అడ్డుకునేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం రాత్రి సమయాల్లో మున్సిపల్, కార్పొరేషన్ ఏరియాల్లో కర్ఫ్యూ విధిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే రైనా అరెస్ట్ జరగడం గమనార్హం.
క్లబ్ని అనుమతించిన సమయం ముగిసిన తర్వాత కూడా సోమవారం రాత్రి దాన్ని అలానే తెరిచి ఉంచడంతో పోలీసులు రైడ్ చేశారు. ఈ క్రమంలో అక్కడే ఒక స్నేహితుడితో కలిసి ఉన్న రైనాతో పాటు మరికొంత మంది సెలబ్రెటీలు, క్లబ్ స్టాఫ్ మెంబర్లని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై కోవిడ్-19 నిబంధనలు ఉల్లఘించారంటూ పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే.. అరెస్టయిన నిమిషాల వ్యవధిలోనే సురేశ్ రైనా బెయిల్పై విడుదలయ్యాడు. ఈ ఏడాది ఆగస్టులో మహేంద్రసింగ్ ధోనీతో పాటు సురేశ్ రైనా కూడా అంతర్జాతీయ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ 2020 సీజన్ నుంచి అర్ధాంతరంగా సురేశ్ రైనా తప్పుకున్నాడు.
సురేశ్ రైనా అరెస్ట్పై అతని పర్సనల్ టీమ్ స్పందించింది. ‘‘సురేశ్ రైనా ఓ షూటింగ్ కోసం ముంబయికి వెళ్లాడు. అయితే.. ఆ షూట్ లేటుగా ముగిసింది. లేకుంటే వెంటనే విమానంలో ఢిల్లీకి వచ్చేసేవాడు. అదే సమయంలో ఒక స్నేహితుడు డిన్నర్ కోసం ఆ క్లబ్లోకి రైనాని ఆహ్వానించాడు. రైనాకి అక్కడి టైమింగ్స్, కొత్త నిబంధనల గురించి తెలియదు. రూల్స్ తెలిసిన తర్వాత వేగంగా అక్కడి నుంచి వచ్చేందుకు ప్రయత్నించాడు. కానీ.. ఇంతలోనే ఆ సంఘటన జరిగిపోయింది. రైనా ఎప్పుడూ ప్రభుత్వ నియమ నిబంధనలకి లోబడే నడుచుకుంటాడు’’ అని ఓ ప్రకటనని టీమ్ విడుదల చేసింది.
క్లబ్ని అనుమతించిన సమయం ముగిసిన తర్వాత కూడా సోమవారం రాత్రి దాన్ని అలానే తెరిచి ఉంచడంతో పోలీసులు రైడ్ చేశారు. ఈ క్రమంలో అక్కడే ఒక స్నేహితుడితో కలిసి ఉన్న రైనాతో పాటు మరికొంత మంది సెలబ్రెటీలు, క్లబ్ స్టాఫ్ మెంబర్లని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై కోవిడ్-19 నిబంధనలు ఉల్లఘించారంటూ పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే.. అరెస్టయిన నిమిషాల వ్యవధిలోనే సురేశ్ రైనా బెయిల్పై విడుదలయ్యాడు. ఈ ఏడాది ఆగస్టులో మహేంద్రసింగ్ ధోనీతో పాటు సురేశ్ రైనా కూడా అంతర్జాతీయ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ 2020 సీజన్ నుంచి అర్ధాంతరంగా సురేశ్ రైనా తప్పుకున్నాడు.
సురేశ్ రైనా అరెస్ట్పై అతని పర్సనల్ టీమ్ స్పందించింది. ‘‘సురేశ్ రైనా ఓ షూటింగ్ కోసం ముంబయికి వెళ్లాడు. అయితే.. ఆ షూట్ లేటుగా ముగిసింది. లేకుంటే వెంటనే విమానంలో ఢిల్లీకి వచ్చేసేవాడు. అదే సమయంలో ఒక స్నేహితుడు డిన్నర్ కోసం ఆ క్లబ్లోకి రైనాని ఆహ్వానించాడు. రైనాకి అక్కడి టైమింగ్స్, కొత్త నిబంధనల గురించి తెలియదు. రూల్స్ తెలిసిన తర్వాత వేగంగా అక్కడి నుంచి వచ్చేందుకు ప్రయత్నించాడు. కానీ.. ఇంతలోనే ఆ సంఘటన జరిగిపోయింది. రైనా ఎప్పుడూ ప్రభుత్వ నియమ నిబంధనలకి లోబడే నడుచుకుంటాడు’’ అని ఓ ప్రకటనని టీమ్ విడుదల చేసింది.