యాప్నగరం

IPL 2020: చెన్నై జట్టులో అదొకటే మార్పు..!

ఐపీఎల్ 2019 సీజన్‌లో మ్యాచ్‌ తర్వాత అన్ని జట్ల డగౌట్లు ఆటగాళ్లతో ఉంటే.. చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ డగౌట్ మాత్రం చిన్న పిల్లలతో నిండిపోయింది. దానికి కారణం జట్టులో 10 మంది ఆటగాళ్ల వయసు 30కిపైగా ఉండటం.

Samayam Telugu 8 Nov 2019, 5:57 pm
ఐపీఎల్ 2020 సీజన్‌ మొదలవడానికి ఇంకా ఐదు నెలల సమయం ఉంది. కానీ.. ఇప్పటి నుంచే అభిమానులు ఐపీఎల్ గురించి చర్చించడం మొదలెట్టేశారు. టోర్నీలోని ఎనిమిది ఫ్రాంఛైజీలు డిసెంబరు 19న కోల్‌కతా వేదికగా జరగనున్న ఆటగాళ్ల వేలానికి సిద్ధమవుతుండగా.. ఏ జట్టులోకి ఎవరు వెళ్లబోతున్నారని అని అభిమానులు నెట్‌లో తెగ శోధిస్తున్నారు.
Samayam Telugu IPL 2020, CSK



Read More: అప్పట్లో సచిన్.. ఇప్పుడు రోహిత్ అంతే: సెహ్వాగ్

ఐపీఎల్ 2018, 2019 సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుని కెప్టెన్‌గా నడిపించిన సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ని ఆ ఫ్రాంఛైజీ ఢిల్లీ క్యాపిటల్స్‌కి రెండు రోజుల క్రితం బదిలీ చేసిన విషయం తెలిసిందే. అశ్విన్‌కి బదులుగా ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి స్పిన్నర్ జగదీశ్ సుచిత్‌ని తీసుకోవడంతో పాటు రూ. 1.5 కోట్లు నగదుని కూడా పంజాబ్‌ దక్కించుకుంది.

Read More: రోహిత్ శర్మ 6, 6, 6 వెనుక గొడవే కారణమా..?

టోర్నీలోని మిగిలిన ఫ్రాంఛైజీలు కూడా ఆటగాళ్ల మార్పులు, చేర్పులు గురించి చర్చిస్తుండటంతో.. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీని ఓ అభిమాని ‘జట్టులో ఏవైనా మార్పులు ఉండబోతున్నాయా..?’ అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకి సరదాగా స్పందించిన సీఎస్‌‌కే ‘అవును.. డాడీస్ ఆర్మీ‌ వయసు మరో ఏడాది పెరగబోతోంది’ అని సమాధానమిచ్చింది.


ఐపీఎల్ 2019 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన ఆటగాళ్లలో దాదాపు 10 మంది క్రికెటర్ల వయసు 30కిపైగా ఉండటంతో.. అందరూ ఆ టీమ్‌ని ‘డాడీస్ ఆర్మీ’ అంటూ కామెంట్లు చేశారు. కానీ.. చెన్నై జట్టు అద్భుత ప్రదర్శనతో ఏకంగా ఫైనల్‌కి చేరి అందర్నీ నోళ్లూ మూయించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.