భారత్, ఇంగ్లాండ్ మధ్య గత వారం జరగాల్సిన ఐదో టెస్టు రద్దుకి కారణం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ లేఖలు రాయడమేనని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ డేవిడ్ గోవర్ ఆరోపించాడు. మాంచెస్టర్ వేదికగా శుక్రవారం నుంచి ఐదో టెస్టు మ్యాచ్ జరగాల్సి ఉండగా.. టాస్కి రెండు గంటల ముందు మ్యాచ్ని రద్దు చేస్తున్నట్లు ఇంగ్లాండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ప్రకటించింది. టీమిండియా క్యాంప్లో వరుసగా కరోనా కేసులు నమోదవడంతో భారత క్రికెటర్లు మైదానంలో అడుగుపెట్టేందుకు నిరాకరించినట్లు వార్తలు వచ్చాయి. ‘‘ఐదో టెస్టుకి ముందురోజు అర్ధరాత్రి విరాట్ కోహ్లీ వరుసగా బీసీసీఐకి లేఖలు రాశాడు. వేరే పరిస్థితులు ఉండి ఉంటే.. కనీసం కొన్ని ఓవర్ల మ్యాచ్ జరిగేది. కానీ.. లాస్ట్ మూమెంట్లో మ్యాచ్ని రద్దు చేశారు. అయితే.. రద్దుకి గల కారణాల్ని సవివరంగా చెప్పి ఉండాల్సింది’’ అని డేవిడ్ గోవర్ చెప్పుకొచ్చాడు.
సెప్టెంబరు 19 నుంచి ఐపీఎల్ 2021 సీజన్ రెండో దశ మ్యాచ్లు జరగనుండగా.. ఒకవేళ ఐదో టెస్టులో ఆడితే తాము కూడా కరోనా వైరస్ బారినపడే ప్రమాదం ఉందని భారత క్రికెటర్లు ఆందోళన చెందారు. ఒకవేళ తాము వైరస్ బారినపడితే..? అప్పుడు ఐపీఎల్ 2021 సీజన్కి దూరమవ్వాల్సి వస్తుందనేది వారి అసలు భయమని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్లు విమర్శించారు. భారత క్రికెటర్లందరూ ఇప్పటికే యూఏఈకి చేరుకోగా.. ఐదో టెస్టు రద్దుతో కోపంలో ఉన్న ఇంగ్లాండ్ క్రికెటర్లు ఐపీఎల్ 2021 సీజన్ నుంచి తప్పుకున్నారు.
సెప్టెంబరు 19 నుంచి ఐపీఎల్ 2021 సీజన్ రెండో దశ మ్యాచ్లు జరగనుండగా.. ఒకవేళ ఐదో టెస్టులో ఆడితే తాము కూడా కరోనా వైరస్ బారినపడే ప్రమాదం ఉందని భారత క్రికెటర్లు ఆందోళన చెందారు. ఒకవేళ తాము వైరస్ బారినపడితే..? అప్పుడు ఐపీఎల్ 2021 సీజన్కి దూరమవ్వాల్సి వస్తుందనేది వారి అసలు భయమని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్లు విమర్శించారు. భారత క్రికెటర్లందరూ ఇప్పటికే యూఏఈకి చేరుకోగా.. ఐదో టెస్టు రద్దుతో కోపంలో ఉన్న ఇంగ్లాండ్ క్రికెటర్లు ఐపీఎల్ 2021 సీజన్ నుంచి తప్పుకున్నారు.