యాప్నగరం

వరల్డ్ కప్ తర్వాత వైదొలుగుతా: ఐసీసీ సీఈవో

ఐసీసీ సీఈవో డేవిడ్ రిచర్డ్‌సన్ తన పదవి నుంచి వైదొలగనున్నారు. వచ్చే ఏడాది వరల్డ్ కప్ ముగిశాక రిటైర్ అవుతున్నట్లు రిచర్డ్‌సన్ ప్రకటించారు.

Samayam Telugu 3 Jul 2018, 7:03 pm
ఐసీసీ సీఈవో డేవిడ్ రిచర్డ్‌సన్ తన పదవి నుంచి వైదొలగనున్నారు. వచ్చే ఏడాది వరల్డ్ కప్ ముగిశాక రిటైర్ అవుతున్నట్లు రిచర్డ్‌సన్ ప్రకటించారు. రిచర్డ్‌సన్ రిటైర్మెంట్ విషయాన్ని ఐసీసీ ధృవీకరించింది. 2002లో రిచర్డ్‌సన్ ఐసీసీ తొలి జనరల్ మేనేజర్ (క్రికెట్‌)గా ఎంపికయ్యారు. 2012లో ఆయన సీఈవోగా ప్రమోషన్ పొందారు. గత 16 ఏళ్లుగా రిచర్డ్‌సన్ క్రికెట్ కౌన్సిల్‌కు ఎనలేని సేవలు చేశారని ఐసీసీ చైర్మన్ శశాంక్ మనోహర్ కొనియాడారు. ఐసీసీ వాణిజ్య పరంగా విజయవంతం కావడంలో ఆయన విశేష కృషి చేశారని మనోహర్ ప్రశంసించారు.
Samayam Telugu richardson


ఎప్పుడు రిటైర్ కావాలో నిర్ణయించుకోవడం క్రికెటర్‌కు కష్టమైన అంశం. కానీ నేను మాత్రం వరల్డ్ కప్ ముగిశాక రిటైర్ కావడం సరైందని అనుకుంటున్నట్లు రిచర్డ్‌సన్ తెలిపారు. తనకు అవకాశం ఇచ్చిన ఐసీసీ చైర్మన్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్‌లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

దక్షిణాఫ్రికాకు చెందిన రిచర్డ్‌సన్ 42 టెస్టులు, 122 వన్డేలు ఆడాడు. వికెట్ కీపర్‌గా సఫారీల విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. 1994-95 సీజన్లో న్యూజిలాండ్‌పై ఏకైక టెస్టు సెంచరీ నమోదు చేశాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.