యాప్నగరం

ఆస్ట్రేలియా గడ్డపై భారత్‌కి పోటీ తప్పదు..!

బాల్ టాంపరింగ్ కారణంగా ఏడాది నిషేధం ఎదుర్కొంటున్న స్మిత్, వార్నర్ ప్రస్తుతం జట్టులో లేకపోవడంతో పర్యటనలో భారత్ జట్టుదే పైచేయి అని కొంత మంది మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.

Samayam Telugu 10 Nov 2018, 5:48 pm
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్లు స్టీవ్‌స్మిత్ ,డేవిడ్ వార్నర్‌లు జట్టులో లేకపోయినా.. సిరీస్‌లో భారత్‌ జట్టు గెలవడం అంత సులువుకాదని మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. నవంబరు 21 నుంచి ఆస్ట్రేలియా పర్యటనని ఆరంభించనున్న భారత్ జట్టు అక్కడ.. మూడు టీ20లు, నాలుగు టెస్టులు, మూడు వన్డేల సుదీర్ఘ సిరీస్‌ని ఆడనుంది.
Samayam Telugu india-v-australia-1st-t20-ranchi_b9c8c330-ab72-11e7-92d8-206e76e802d4


బాల్ టాంపరింగ్ కారణంగా ఏడాది నిషేధం ఎదుర్కొంటున్న స్మిత్, వార్నర్ ప్రస్తుతం జట్టులో లేకపోవడంతో పర్యటనలో భారత్ జట్టుదే పైచేయి అని కొంత మంది మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. కానీ.. ఆస్ట్రేలియా జట్టుని దాని సొంతగడ్డపై ఓడించడం అంత సులువుకాదని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.

‘ఆస్ట్రేలియా జట్టు దాని సొంతగడ్డపై ఆడుతుండటంతో.. డేవిడ్ వార్నర్, స్టీవ్‌ స్మిత్‌ టీమ్‌లో లేరనేది వారికి సమస్యేకాదు. ప్రస్తుతం ఆ టీమ్‌లో ఉన్న యువ ఆటగాళ్లు.. అక్కడ ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడటంతో పాటు ఇటీవల టెస్టు క్రికెట్‌ని కూడా ఆడి సెంచరీలు సాధించారు. వారికి అంతర్జాతీయ క్రికెట్ అనుభవం పెద్దగా లేకపోవచ్చు. కానీ.. వారు కచ్చితంగా భారత్ జట్టుకి గట్టి పోటీనిస్తారు’ అని వీరేంద్ర సెహ్వాగ్ వెల్లడించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.