యాప్నగరం

ఐపీఎల్ తొలి మ్యాచ్‌కి బెంగళూరు కెప్టెన్..?

కోహ్లి ఏప్రిల్ 2న జట్టుతో కలుస్తాడు. బీసీసీఐ వైద్యులు, ఫిజియో‌తో ఇప్పటికే నేను కోహ్లి గాయం గురించి చర్చించాను. మా ఫ్రాంఛైజీ వైద్యులు

TNN 30 Mar 2017, 7:54 pm
ఐపీఎల్ పదో సీజన్ ఆరంభానికి ముందే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన టెస్టు సిరీస్‌లో గాయపడిన కోహ్లి ఇంకా పూర్తి స్థాయిలో ఫిటెనెస్ సాధించలేదని బెంగళూరు కోచ్ డేనియల్ వెటోరీ వెల్లడించాడు. గత ఏడాది ఐపీఎల్ విజేత సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఏప్రిల్ 5న ఉప్పల్ వేదికగా బెంగళూరు జట్టు తొలి మ్యాచ్‌లో ఢీకొనబోతోంది. ఫైనల్లో అనూహ్యంగా ఓటమి చవిచూసిన బెంగళూరు తొలి మ్యాచ్‌లోనే హైదరాబాద్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని ఉవ్విళ్లూరుతున్న సమయంలో కోహ్లి గాయం జట్టును ఆందోళన పరుస్తోంది. ఒకవేళ కోహ్లి తొలి మ్యాచ్‌ ఆడలేకపోతే.. హిట్టర్ ఏబీ డివిలియర్స్ జట్టుకు నాయకత్వం వహిస్తాడని వెటోరి వివరించాడు.
Samayam Telugu de villiers to lead rcb in kohlis absence
ఐపీఎల్ తొలి మ్యాచ్‌కి బెంగళూరు కెప్టెన్..?


‘కోహ్లి ఏప్రిల్ 2న జట్టుతో కలుస్తాడు. బీసీసీఐ వైద్యులు, ఫిజియో‌తో ఇప్పటికే నేను కోహ్లి గాయం గురించి చర్చించాను. మా ఫ్రాంఛైజీ వైద్యులు కూడా గాయంపై అవగాహనతో ఉన్నారు. అయితే కోహ్లి తొలి మ్యాచ్ ఆడటంపై ఇంకా స్పష్టత రావడం లేదు. ఒకవేళ విరాట్ ఫిటెనెస్ సాధించలేకపోతే ఏబీ డివిలియర్స్ బెంగళూరు జట్టును నడిపిస్తాడు. సర్ఫరాజ్ ఖాన్, మన్‌దీప్ సింగ్ లాంటి యువ క్రికెటర్లు అవకాశం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. వారిని పరీక్షిస్తాం’ అని వెటోరీ వివరించాడు. గత ఏడాది సీజన్ మధ్యలో గాయపడిన కోహ్లి.. చేతికి కుట్లు వేయించుకుని మరీ భారీ శతకాలు బాదిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.