యాప్నగరం

ఢిల్లీలో భారత్ vs బంగ్లాదేశ్‌ తొలి టీ20 డౌట్..?

ఢిల్లీలో వాతావరణ కాలుష్యం పతాక స్థాయికి చేరింది. ఆ ప్రభావం భారత్, బంగ్లాదేశ్ మధ్య వచ్చే ఆదివారం జరగనున్న తొలి టీ20 మ్యాచ్‌పై పడే సూచనలు కనిపిస్తున్నాయి.

Samayam Telugu 27 Oct 2019, 1:06 pm
భారత్, బంగ్లాదేశ్‌ మధ్య నవంబరు 3న జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్‌పై అనుమానాలు నెలకొన్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ (ఫిరోజ్ షా కోట్ల) స్టేడియం వేదికగా మ్యాచ్ జరగాల్సి ఉండగా.. దీపావళి నేపథ్యంలో ఢిల్లీలో ప్రస్తుతం పొల్యూషన్ పతాక స్థాయికి చేరిన విషయం తెలిసిందే. దీంతో.. క్రికెటర్లు అనారోగ్యంబారిన పడే ప్రమాదం ఉన్నందున మ్యాచ్ నిర్వహణపై బీసీసీఐ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది.
Samayam Telugu India vs Bangladesh 1st T20I


Read More: undefined
2017, డిసెంబరులో భారత్, శ్రీలంక మధ్య టెస్టు మ్యాచ్ జరగగా.. అప్పుడు ఢిల్లీలో పొల్యూషన్ కారణంగా మైదానంలోనే శ్రీలంక ఆటగాళ్లు వాంతులు చేసుకున్నారు. కొందరు క్రికెటర్లు మాస్క్‌లు వేసుకుని మ్యాచ్ ఆడాల్సి వచ్చింది. అప్పటితో పోలిస్తే.. ఇప్పుడు పొల్యూషన్ మరింత పెరిగినట్లు తెలుస్తోంది. దీంతో.. మ్యాచ్ సమయానికి పరిస్థితి ఎలా ఉంటుందో..? అని ఇరు జట్ల ఆటగాళ్లు కంగారుపడుతున్నారు.

Read More: undefined

ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రకారం.. ప్రస్తుతం ఢిల్లీలో పొల్యూషన్ 357 పాయింట్లకి పెరిగినట్లు తెలుస్తోంది. ఇది 400కి పెరిగితే మాత్రం.. తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉన్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీపావళి నేపథ్యంలో గత మూడు రోజుల నుంచి పొల్యూషన్ భారీగా పెరిగినట్లు గణాంకాలు చెప్తున్నాయి. అయితే.. మ్యాచ్‌కి మరో వారం సమయం ఉండగా.. అప్పటిలోపు పొల్యూషన్ ఏ మేరకు తగ్గుతుందో..? చూడాలి. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఆదివారం రాత్రి 7 గంటలకి తొలి టీ20 మ్యాచ్ జరగాల్సి ఉంది.

Read More: బంగ్లాదేశ్‌తో టీ20, టెస్టు సిరీస్‌కి భారత్ జట్టు ప్రకటన

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.