యాప్నగరం

DDCA ఉద్యోగికి కరోనా పాజిటివ్.. క్రికెట్ స్టేడియం మూసివేత

భారత్‌లో దేశవాళీ క్రికెట్‌ని త్వరలోనే ప్రారంభించాలని ఆశిస్తున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ).. అక్టోబరు నుంచి ట్రైనింగ్ సెషన్స్‌ని స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తోంది. కానీ..?

Samayam Telugu 8 Sep 2020, 7:02 am
భారత్‌లో దేశవాళీ క్రికెట్‌ పునరాగమనం మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. తాజాగా ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోషియేషన్ (డీడీసీఏ) ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దాంతో.. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల స్టేడియంతో పాటు ఆఫీస్‌ని మూసివేస్తున్నట్లు డీడీసీఏ అధికారులు తెలిపారు. శానిటైజ్ తర్వాత అందరూ కరోనా నెగటివ్ టెస్టు రిపోర్ట్ చూపించిన తర్వాతే ఆఫీస్‌లోకి అనుమతిస్తామని డీడీసీఏ జాయింట్ సెక్రటరీ రజన్ మంచంద్ర స్పష్టం చేశాడు.
Samayam Telugu Feroz Shah Kotla Stadium
Directions


వాస్తవానికి డీడీసీఏ కరోనా వైరస్ జాగ్రత్తల్లో భాగంగా ఏ ఉద్యోగి అయినా సిక్ లీవ్ తీసుకుంటే.. మళ్లీ కోవిడ్-19 నెగటివ్ రిపోర్ట్ చూపించిన తర్వాతే డ్యూటీలో జాయిన్ కావాలని ఆదేశాలు జారీ చేసింది. కానీ.. తాజాగా కరోనా పాజిటివ్‌గా తేలిన ఉద్యోగి.. ఆ రూల్స్‌ని బ్రేక్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దాంతో.. షోకాజ్ నోటీసులు అతనికి డీడీసీఏ జారీ చేసినట్లు తెలుస్తోంది.

కరోనా సోకిన ఉద్యోగితో ఇటీవల కాంటాక్ట్ అయిన ఉద్యోగుల్ని సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించినట్లు చెప్పుకొచ్చిన డీడీసీఏ జాయింట్ సెక్రటరీ రజన్ మంచంద్ర.. బాధిత ఉద్యోగి ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు తెలిపారు. తాజాగా కరోనా వైరస్ కేసు నమోదవడంతో స్టేడియంలో అక్టోబరు నుంచి ప్రారంభించనున్న ట్రైనింగ్ సెషన్ వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.