యాప్నగరం

ధోనీ మెంటార్ దేవల్ సహాయ్ కన్నుమూత

భారత దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ మెంటార్ దేవల్ సహాయ్ మంగళవారం వేకువ జామున కన్నుమూశారు. ధోనీ కోసం తొలిసారి ఆయన రాంచీలో టర్ఫ్ పిచ్‌లను రూపొందించారు.

Samayam Telugu 24 Nov 2020, 4:20 pm
భారత దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ మెంటార్ దేవల్ సహాయ్ కన్నుమూశారు. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా మంగళవారం వేకువజామున రాంచీలోని ఓ హాస్పిటల్‌లో తుది శ్వాస విడిచారు. 73 ఏళ్ల సహాయ్‌ అసలు పేరు దియోబ్రత్ కానీ ఆయన దేవల్‌గానే పేరు గడించారు. శ్వాస సంబంధ సమస్యల కారణంగా హాస్పిటళ్లలో 40 రోజులపాటు గడిపిన ఆయన అక్టోబర్ 9న డిశ్చార్జయ్యారు.
Samayam Telugu MS Dhoni mentor Deval Sahay


కానీ పది రోజుల తర్వాత అనారోగ్యం బారిన పడటంతో సహాయ్ మళ్లీ హాస్పిటల్‌ పాలయ్యారు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు నాన్న చనిపోయారని ఆయన తండ్రి అభినవ్ ఆకాశ్ సహాయ్ తెలిపారు. అమెరికాలో నివసిస్తున్న సహాయ్ కుమార్తె మీనాక్షి ఇటీవల రాంచీకి వచ్చారు.

ఎలక్ట్రికల్ ఇంజినీర్ అయిన సహాయ్.. రాంచీలో ధోనీ కోసం తొలిసారి పచ్చిక (టర్ఫ్) పిచ్‌లను రూపొందించారు. మెకాన్‌లో చీఫ్ ఇంజినీర్‌గా పని చేసిన సహాయ్.. సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (సీసీఎల్) డైరెక్టర్‌గా పదవీ విరమణ చేశారు. సీసీఎల్‌లో పని చేస్తుండగానే ధోనీకి టర్ఫ్ పిచ్‌ల మీద ఆడే అవకాశం కల్పించారు. ధోనీ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘ఎంఎస్ ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ’ చిత్రంలోనూ సహాయ్ పాత్ర కనిపిస్తుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.