యాప్నగరం

తొలి వన్డేలో శతకం బాదిన శిఖర్..!

ధావన్ కేవలం 71 బంతుల్లోనే 16 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 100 పరుగుల మైలురాయిని అందుకున్నాడు

TNN 20 Aug 2017, 8:20 pm
శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ ఓపెనర్ శిఖర్ ధావన్ శతకంతో చెలరేగాడు. ధావన్ కేవలం 71 బంతుల్లోనే 16 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 100 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. మరో ఎండ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా అర్ధశతకం నమోదు చేయడంతో 217 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన భారత్ 25 ఓవర్లు ముగిసే సమయానికి 181/1తో విజయం దిశగా దూసుకెళ్తోంది.
Samayam Telugu dhawan kohli help india cruise
తొలి వన్డేలో శతకం బాదిన శిఖర్..!


తొలి ఓవర్‌ నుంచి దూకుడుగా ఆడిన ధావన్.. తన ఫేవరెట్ బౌలర్ మలింగ బౌలింగ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. స్పిన్నర్ల బౌలింగ్‌లో స్వేచ్ఛగా క్రీజు వెలుపలకి వచ్చి మైదానం నలువైపులా బౌండరీలు బాదేశాడు. ఈ క్రమంలోనే కేవలం 120 బంతుల్లోనే కోహ్లితో కలిసి రెండో వికెట్‌కి ధావన్ అభేద్యంగా 158 పరుగులతో భారత్ విజయానికి బాటలు వేశాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.