యాప్నగరం

దటీజ్ ధోనీ.. అంపైర్ దగ్గరకెళ్లి ఆరా తీసి మరీ ఎటాక్

మెల్‌‌బోర్న్ వన్డేలో ధోనీ పక్కా ప్లాన్‌తో ఆడి భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. చివర్లో విజయానికి 24 బంతుల్లో 33 రన్స్ అవసరమైన దశలో అంపైర్ దగ్గరకెళ్లి.. ఎవరి బౌలింగ్‌ను ఎదుర్కోవాల్సి ఉంటుందో కనుకున్నాడు.

Samayam Telugu 19 Jan 2019, 3:26 pm
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ప్రారంభానికి ముందు ధోనీని విమర్శించిన నోళ్లు ఇప్పుడు మూతపడ్డాయి. హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలు సాధించిన మహీ.. తనేంటో మరోసారి ఫ్రూవ్ చేసుకున్నాడు. ముఖ్యంగా సిరీస్ విజేతను తేల్చే మూడో వన్డేలో ఒత్తిడిలోనూ ధోనీ ప్రశాంతంగా ఆడాడు. పిచ్ మందకొడిగా ఉండటంతో బ్యాటింగ్ కష్టమైంది. దీంతో సింగిల్స్ తీయడానికే ప్రాధాన్యం ఇచ్చాడు. సాధించాల్సిన రన్‌రేట్ పెరిగినా, ఒత్తిడి దరి చేరనీయకుండా ధోనీ కూల్‌గా ఉన్నాడు. చివరి వరకూ క్రీజులో ఉంటే సునాయసంగా విజయం సాధించొచ్చనేది మహీ నమ్మే సూత్రం.
Samayam Telugu dhoni


తనపై ఎన్ని విమర్శలు వచ్చినా ధోనీ మాత్రం కూల్‌గా ఆలోచిస్తూ.. ఏం చేయాలో అదే చేస్తుంటాడు. ప్రపంచ క్రికెట్లో బెస్ట్ బ్రెయిన్‌గా ధోనీకి పేరుంది. తనను అలా ఎందుకు పిలుస్తారో మెల్‌బోర్న్ వన్డే ద్వారా మహీ మరోసారి ప్రపంచానికి చాటి చెప్పాడు. 47వ ఓవర్ ప్రారంభంలో.. విజయానికి 24 బంతుల్లో 33 రన్స్ అవసరమైన దశలో ధోనీ అంపైర్ దగ్గరకు వెళ్లాడు. ఇంకా ఏ బౌలర్‌కు ఎన్ని ఓవర్లు మిగిలి ఉన్నాయో అంపైర్‌ను అడిగి తీసుకున్నాడు.
చర్డ్‌సన్, ఆడమ్ జంపా బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో భారత బ్యాట్స్‌మెన్ ఇబ్బంది పడ్డారు. దీంతో వారి బౌలింగ్ కోటా ముగిసే వరకూ ఎదురు దాడికి దిగకుండా ధోనీ ఓపిక పట్టాడు. విజయానికి ఎన్ని పరుగులు అవసరమో లెక్కలేసుకొని సిడిల్, స్టోయినిస్ బౌలింగ్‌లో పరుగులు రాబట్టడానికి ప్లాన్ వేశాడు. తన ప్రణాళికను అమల్లోపెట్టి భారత్‌కు విజయాన్ని అందించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.