యాప్నగరం

ధోనీ బొమ్మ గీసిన సెహ్వాగ్ పెద్ద కొడుకు

సెహ్వాగ్ పెద్ద కుమారుడు ఆర్యవీర్ ధోనీ స్కెచ్ వేశాడు. అది ఎలా ఉందో చూస్తారా మరి?

TNN 25 Jan 2017, 1:42 pm
భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారనే సంగతి తెలిసిందే. పెద్దబ్బాయి పేరు ఆర్యవీర్, చిన్నోడి పేరు వేదాంత్. వీరూ పెద్ద కుమారుడు ఆర్యవీర్ తాజాగా ధోనీ బొమ్మ గీసేశాడు. ఎడమ కాలు పైకెత్తి ధోనీ షాట్ కొడుతున్న ఫొటోను ఆర్యవీర్ పెన్సిల్‌ స్కెచ్ వేశాడు. ఆ ఫొటోను సెహ్వాగ్ షేర్ చేశాడు. ఈ స్కెచ్‌లో కూడా మహీ భాయ్ షాట్ కొడుతున్నాడు చూడండంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు నెటిజన్లు తెగ రియాక్ట్ అయ్యారు. లెక్‌లు, కమెంట్లతో ట్విట్టర్‌ను హోరెత్తించారు. జూనియర్ సెహ్వాగ్ కూడా ధోనీ అభిమానేనా అంటూ నెటిజన్లు వీరూకు ప్రశ్నల వర్షం కురిపించారు. మరి కొందరైతే ఆ పుస్తకం ఎక్కడిదో చెప్పు వీరూ భాయ్ అంటూ ప్రశ్నలు సంధించారు. ఆర్యవీర్ అంత గొప్పగా గీశాడా బొమ్మను మరి.
Samayam Telugu dhoni sketch by sehwag elder son
ధోనీ బొమ్మ గీసిన సెహ్వాగ్ పెద్ద కొడుకు


Pic 1 is a sketch of @msdhoni made by my elder son Aaryavir .Even in this sketch,Maahi maar raha hai. #JaiNataraj pic.twitter.com/VlT7DvpTCC— Virender Sehwag (@virendersehwag) January 25, 2017
టెస్టుల్లో వీరేంద్ర సెహ్వాగ్ చేసిన 319 పరుగులే ఇప్పటి వరకూ భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు అనే సంగతి తెలిసిందే. ఈ రికార్డును బద్దలు కొడితే మీకు ఫెరారీ కారు కొనిస్తా అని వీరూ తన పిల్లలతో చెప్పాడట. అది అంతర్జాతీయ క్రికెట్లోనే కానక్కర్లేదు.. స్కూలు క్రికెట్లో ఈ రికార్డు బద్దలుకొట్టినా సరే ఫెరారీ ఇస్తాడట. మరి వారిద్దరిలో ఎవరు కారు కొట్టేస్తారో చూడాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.