యాప్నగరం

కోహ్లీ అప్పుడే ఒకే చెప్పి.. ఇప్పుడు ఫిర్యాదేంటి..?

భారత్ జట్టు బిజీ బిజీగా మ్యాచ్‌లు ఆడుతోంది. నిజమే.. కానీ.. ఈ సిరీస్, షెడ్యూల్స్‌ని కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు ఆటగాళ్లు అంగీకారం తెలిపిన తర్వాత రూపొందించినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది.

Samayam Telugu 31 Jan 2020, 4:07 pm
టీమిండియా బిజీ షెడ్యూల్‌పై కెప్టెన్ విరాట్ కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేయడం తనని ఆశ్చర్యపరిచిందని భారత మహిళా మాజీ క్రికెటర్ డయానా ఎడుల్జీ అభిప్రాయపడ్డారు. ఇటీవల భారత్ గడ్డపై ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో తలపడిన టీమిండియా.. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే న్యూజిలాండ్‌ టూర్‌కి వెళ్లి అక్కడ టీ20 సిరీస్ ఆడుతోంది. ఈ బిజీ షెడ్యూల్‌పై ఇటీవల మీడియా సమావేశంలో విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. భవిష్యత్‌లో విమానాశ్రయం నుంచి నేరుగా స్టేడియానికి వెళ్లి మ్యాచ్ ఆడాల్సి వస్తుందేమో..? అని ఆందోళన వ్యక్తం చేశాడు.
Samayam Telugu diana edulji reacts on virat kohlis complaint of team indias busy schedule
కోహ్లీ అప్పుడే ఒకే చెప్పి.. ఇప్పుడు ఫిర్యాదేంటి..?


టీమిండియా షెడ్యూల్‌పై విరాట్ కోహ్లీ స్పందించిన తీరు సరిగా లేదని ఇప్పటికే బీసీసీఐ పెద్దలు మండిపడగా.. తాజాగా డయానా ఎడుల్జీ కూడా స్పందించారు. బీసీసీఐ పాలన కోసం గతంలో సుప్రీంకోర్టు నియమించిన పాలకుల కమిటీలో ఎడుల్జీ కూడా ఒక మెంబర్‌గా కొనసాగిన విషయం తెలిసిందే. దీంతో.. టీమిండియా షెడ్యూల్‌పై ఫ్యూచర్ టూర్ పోగ్రామ్ (ఎఫ్‌టీఏ)‌కి అప్పట్లో కెప్టెన్‌గా కోహ్లీ అంగీకరించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.

‘భారత్ జట్టు షెడ్యూల్‌పై విరాట్ కోహ్లీ ఫిర్యాదు చేయడం నాకు చాలా కొత్తగా అనిపించింది. ఇటీవల కాలంలో అతను చాలా మ్యాచ్‌లు ఆడాడు. నిజమే.. కానీ.. కెప్టెన్‌గా ఎఫ్‌టీఏకి అతను అంగీకారం తెలిపిన తర్వాత షెడ్యూల్‌ని ప్రకటించారు. మరి ఇప్పుడేంటి కొత్తగా ఫిర్యాదు..? ఆ షెడ్యూల్‌లో న్యూజిలాండ్ పర్యటనకి ఎప్పుడు.. ఏ సమయానికి వెళ్లబోతారు..? అనే విషయం స్పష్టంగా ఉంది. అందరు ఆటగాళ్లు ఒకే చెప్పిన తర్వాతే షెడ్యూల్‌ని రూపొందించారు’ అని డయానా ఎడుల్జీ వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.