యాప్నగరం

ఆ ఓటమి తప్పితే.. లంక బాగా ఆడింది

భారత్‌తో నాగ్‌పూర్ టెస్టు ఓటమిని తప్పిస్తే.. సిరీస్‌ సాంతం శ్రీలంక జట్టు చాలా బాగా ఆడిందని ఆ జట్టు కెప్టెన్ దినేశ్ చండిమాల్

TNN 6 Dec 2017, 9:16 pm
భారత్‌తో నాగ్‌పూర్ టెస్టు ఓటమిని తప్పిస్తే.. సిరీస్‌ సాంతం శ్రీలంక జట్టు చాలా బాగా ఆడిందని ఆ జట్టు కెప్టెన్ దినేశ్ చండిమాల్ ప్రశంసించాడు. ఫిరోజ్ షా కోట్ల వేదికగా బుధవారం ముగిసిన మూడో టెస్టు‌లో చివరి వరకూ పోరాడిన లంక మ్యాచ్‌ని డ్రాగా ముగించిన విషయం తెలిసిందే. క్లిష్ట సమయంలో ధనుంజయ, రోషన్ చాలా బాగా బ్యాటింగ్ చేసి జట్టుని ఓటమి నుంచి తప్పించారని చండిమాల్ గుర్తు చేశాడు. మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో శ్రీలంక కెప్టెన్ సిరీస్‌ తీరు గురించి మాట్లాడాడు.
Samayam Telugu dinesh chandimal was really a good series against india apart from the second test
ఆ ఓటమి తప్పితే.. లంక బాగా ఆడింది


‘భారత్‌తో టెస్టు సిరీస్ చాలా ఆసక్తికరంగా ముగిసింది. రెండో టెస్టు ఫలితాన్ని తప్పిస్తే.. శ్రీలంక జట్టు చాలా బాగా ఆడింది. ఈ సిరీస్‌లో మేము చాలా నేర్చుకున్నాం. ఈ క్రిడెట్ అంతా ఆటగాళ్లు, టీమ్ మేనేజ్‌మెంట్‌కే దక్కాలి. మ్యాచ్ గమనానికి అనుగుణంగా ప్రణాళికలు చక్కగా అమలు చేయగలిగారు. సీనియర్ స్పిన్నర్ రంగనా హెరాత్ దూరమవడంతో అంతా మాథ్యూస్‌పై భారం వేశారు. అతను తనకిచ్చిన బాధ్యతను చక్కగా నిర్వర్తించాడు. ధనుంజయ, రోషన్ అసాధారణ బ్యాటింగ్‌తో జట్టుని ఓటమి నుంచి తప్పించారు. భారత్ లాంటి అగ్రశ్రేణి జట్టు బౌలర్లని వాళ్లు సమర్థంగా ఎదుర్కొన్నారు. సిరీస్‌‌లో మా జట్టు ప్రదర్శనపై సంతోషంగా ఉన్నా’ అని చండిమాల్ వివరించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.