విరాట్ కోహ్లి కెప్టెన్సీలో టెస్టు మ్యాచ్లు ఆడాలని తాను కోరుకుంటున్నట్లు వికెట్ కీపర్/ బ్యాట్స్మెన్ దినేశ్ కార్తీక్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇటీవల వన్డే, టీ20 జట్టులో స్థానం సంపాదించుకున్న దినేశ్ కార్తీక్ వెస్టిండీస్ పర్యటనలో బ్యాట్తో మెరిశాడు. అయితే.. మళ్లీ తెలుపు రంగు జెర్సీ ధరించి భారత్ తరఫున టెస్టులు ఆడేందుకు తాను ప్రయత్నిస్తున్నట్లు కార్తీక్ వెల్లడించాడు.
‘ప్రస్తుతం నేను వన్డే, టీ20 జట్టులో స్థానం సంపాదించగలిగాను. టెస్టుల్లో స్థానం కోసం ఆశగా ఎదురుచూస్తున్నా. తెలుపు రంగు జెర్సీ ధరించి విరాట్ కోహ్లి కెప్టెన్సీలో టెస్టులు ఆడటం ఇప్పుడు నా కల. ఆ ఫార్మాట్కి సరిపోయే బ్యాటింగ్ టెక్నిక్ నా దగ్గర ఉంది. కచ్చితంగా జట్టు మిడిలార్డర్లో నాదైన ముద్ర వేయగలుతాను’ అని దినేశ్ కార్తీక్ వివరించాడు. 2010లో బంగ్లాదేశ్పై చివరిసారిగా దినేశ్ కార్తీక్ టెస్టు మ్యాచ్ ఆడాడు.
‘ప్రస్తుతం నేను వన్డే, టీ20 జట్టులో స్థానం సంపాదించగలిగాను. టెస్టుల్లో స్థానం కోసం ఆశగా ఎదురుచూస్తున్నా. తెలుపు రంగు జెర్సీ ధరించి విరాట్ కోహ్లి కెప్టెన్సీలో టెస్టులు ఆడటం ఇప్పుడు నా కల. ఆ ఫార్మాట్కి సరిపోయే బ్యాటింగ్ టెక్నిక్ నా దగ్గర ఉంది. కచ్చితంగా జట్టు మిడిలార్డర్లో నాదైన ముద్ర వేయగలుతాను’ అని దినేశ్ కార్తీక్ వివరించాడు. 2010లో బంగ్లాదేశ్పై చివరిసారిగా దినేశ్ కార్తీక్ టెస్టు మ్యాచ్ ఆడాడు.