యాప్నగరం

ఎవరి నోళ్లూ మూయించాల్సిన అవసరం లేదు: పుజారా

నేను పరుగులు రాబడితే చాలు.. ఎవరి నోళ్లూ మూయించాల్సిన అవసరం లేదు. గత పర్యటన నుంచి పాఠాలు నేర్చుకున్నాను - పుజారా.

Samayam Telugu 27 Dec 2018, 5:52 pm
ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టులో ఛటేశ్వర్ పుజారా శతకం బాదడంతో.. భారత్ 443/7 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఈ సిరీస్‌లో రెండో శతకం బాదిన పుజారాకు ఓవరాల్‌గా ఇది 17వ టెస్టు సెంచరీ కావడం విశేషం. ఐదు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 328 పరుగులు చేసిన ఈ సౌరాష్ట్ర బ్యాట్స్‌మెన్.. ఈ సిరీస్‌‌లో ఇప్పటి వరకూ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. గత ఆసీస్ పర్యటనలో పేలవ ఫామ్‌తో ఇబ్బందులు పడ్డ పుజారా.. తాజా టూర్‌లో సత్తా చాటుతున్నాడు.
Samayam Telugu pujara defence


2014 పర్యటనలో ఆరు ఇన్నింగ్స్‌ల్లో ఒకే ఒక హాఫ్ సెంచరీ సాధించిన పుజారాపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ విషయాన్ని పుజారాకు గుర్తుకు చేయగా.. విమర్శకుల నోళ్లూ మూయించాల్సిన అవసరం నాకు లేదని స్పష్టం చేశాడు. ‘అంతర్జాతీయ క్రికెట్ ఆడేటప్పుడు.. నేను పరుగులు చేస్తే చాలు.. రన్స్ చేయడాన్ని నేను ఇష్టపడతా. మిగతా వ్యవహారాల్లో తలదూర్చాల్సిన అవసరం నాకు లేద’ని పుజారా తెలిపాడు. నా బాధ్యత పరుగులు చేయడం, స్వదేశమైనా, విదేశమైనా.. నేను పరుగులు చేస్తూనే ఉంటాన’ని పుజారా చెప్పుకొచ్చాడు. మెల్‌బోర్న్ సెంచరీని ముఖ్యమైందిగా పేర్కొన్న పుజారా.. అడిలైడ్‌లో జట్టు విజయానికి దోహదం చేసిన శతకాన్ని ప్రత్యేకమైందిగా అభివర్ణించాడు.

2014లో పుజారా తొలిసారి ఆస్ట్రేలియా గడ్డ మీద టెస్టు సిరీస్ ఆడాడు. ఆ సిరీస్‌ను బాగానే ఆరంభించిన పుజారా.. తొలి ఇన్నింగ్స్‌లోనే అర్ధ శతకం బాదాడు. కానీ మిగతా ఇన్నింగ్స్‌ల్లో ఆకట్టుకోలేకపోయాడు. గత పర్యటనలో ఎక్కువగా పరుగులు చేయలేకపోయానన్న పుజారా.. తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకున్నానని చెప్పాడు. గత పర్యటన నేర్పిన పాఠాల వల్లే ఈసారి శతకాలు చేయగలుగుతున్నానని చెప్పాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.