ప్రైవేట్ టీ20 లీగ్స్ కారణంగా ఇంటర్నేషనల్ క్రికెట్ ప్రమాదంలో పడుతోందని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డుప్లెసిస్ హెచ్చరించాడు. 2008లో భారత్ వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభమవగా.. ఈ టోర్నీకి లభించిన ఆదాయం, ఆదరణ చూసిన మిగిలిన దేశాలు కూడా ప్రైవేట్ టీ20 లీగ్స్ని ప్రారంభించాయి. ఈ క్రమంలో ఆస్ట్రేలియాలో బిగ్బాష్ లీగ్, వెస్టిండీస్లో కరీబియన్ ప్రీమియర్ లీగ్, అఫ్గానిస్థాన్ ప్రీమియర్ లీగ్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్, పాకిస్థాన్ సూపర్ లీగ్, దక్షిణాఫ్రికాలో మాన్షి సూపర్ లీగ్ జరుగుతున్నాయి. అయితే.. ఇప్పటికీ క్రేజ్ విషయంలో ఐపీఎల్ దరిదాపుల్లోకి కూడా ఏ లీగ్ రాలేకపోతోంది. కానీ.. పుట్టగొడుగుల్లా పట్టుకొస్తున్న ఈ ప్రైవేట్ టీ20 లీగ్స్ కారణంగా.. ఇంటర్నేషనల్ క్రికెట్ కళ తప్పుతోందని డుప్లెసిస్ ఆందోళన వ్యక్తం చేశాడు. ‘‘ప్రైవేట్ టీ20 లీగ్స్ కారణంగా ఇంటర్నేషనల్ క్రికెట్ ప్రమాదంలో పడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి ఏడాది లీగ్స్ పెరిగిపోతున్నాయి. ఆరంభంలో ఓ రెండు లీగ్స్ మాత్రమే ఉండేవి. ఇప్పుడు అవి 6-7కి చేరుకున్నాయి. ఉదాహరణగా నేనే ఓ 3-4 లీగ్స్లో ఆడుతున్నాను. భవిష్యత్లో పరిస్థితి ఎలా ఉంటుందో..? నా తరహాలోనే చాలా మంది ప్రైవేట్ లీగ్స్ ఆడుతున్నారు. మరీ ముఖ్యంగా.. వెస్టిండీస్ ప్రధాన ఆటగాళ్లు ఇంటర్నేషనల్ క్రికెట్లో ఆడటం కంటే టీ20 లీగ్స్లో ఆడేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా ఆటగాళ్లు కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు’’ అని డుప్లెసిస్ వెల్లడించాడు.
వెస్టిండీస్కి చెందిన క్రిస్గేల్, డ్వేన్ బ్రావో, ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్ తదితరులు ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్లు ఆడేందుకు ఆసక్తి చూపడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ టీ20 క్రికెట్ లీగ్స్ జరుగుతున్నా.. వెస్టిండీస్ ఆటగాళ్లు అక్కడ ప్రత్యక్షమవుతున్నారు. ఆ సమయంలో ఇంటర్నేషనల్ మ్యాచ్ల షెడ్యూల్ ఉన్నా వారు పట్టించుకోవడం లేదు.
వెస్టిండీస్కి చెందిన క్రిస్గేల్, డ్వేన్ బ్రావో, ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్ తదితరులు ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్లు ఆడేందుకు ఆసక్తి చూపడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ టీ20 క్రికెట్ లీగ్స్ జరుగుతున్నా.. వెస్టిండీస్ ఆటగాళ్లు అక్కడ ప్రత్యక్షమవుతున్నారు. ఆ సమయంలో ఇంటర్నేషనల్ మ్యాచ్ల షెడ్యూల్ ఉన్నా వారు పట్టించుకోవడం లేదు.