యాప్నగరం

ఫాస్ట్ బౌలర్ల కంటే.. శ్రీలంక ఏనుగులే..?

మైదానంలో ఫాస్ట్ బౌలర్ల కంటే.. అటవీ ప్రాంతంలోని ఏనుగులు తనని ఎక్కువగా భయపెట్టాయని శ్రీలంక మాజీ

TNN 29 Aug 2017, 3:50 pm
మైదానంలో ఫాస్ట్ బౌలర్ల కంటే.. అటవీ ప్రాంతంలోని ఏనుగులు తనని ఎక్కువగా భయపెట్టాయని శ్రీలంక మాజీ క్రికెటర్ రొమేష్ కలువీతర వెల్లడించాడు. కుమార సంగక్కర‌‌ కంటే ముందు అంటే.. 1990లో కలువీతర ‘లిటిల్ కాలు’ పేరు‌తో వికెట్‌ కీపర్‌గా ప్రాచుర్యం పొందాడు. వన్డేల్లో సనత్ జయసూర్యతో కలిసి పోటాపోటీగా బ్యాటింగ్ చేస్తూ.. తనదైన ముద్రవేశాడు. విహార యాత్రలంటే ఎక్కువ ఇష్టపడే కలువీతర.. ఒకసారి కుటుంబ సభ్యులతో కలిసి అటవీ ప్రాంతంలో పర్యటిస్తూ ఏనుగుల గుంపునకి ఎదురుపడ్డాడట. ఆ సమయంలో భయంకరమైన ఫాస్ట్ బౌలర్ల కంటే ఆ ఏనుగులే తనకి భయానకంగా కనిపించాయని తాజాగా అతను గుర్తు చేసుకున్నాడు.
Samayam Telugu encounter with forest elephants more frightful than facing deadly pacers
ఫాస్ట్ బౌలర్ల కంటే.. శ్రీలంక ఏనుగులే..?


‘వాహనంలో వెళ్తూ ఏనుగుల గుంపునకి ఎదురుపడ్డాం. దారి చిన్నదిగా ఉండటంతో ఆ సమయంలో మేము తప్పించుకోవడం కష్టమేనని నాకు అర్థమైంది. కొంచెం.. కొంచె.. ఎక్స్‌లేటర్ పెంచుతూ బండిని ముందుకు కదిలించేందుకు ప్రయత్నించా. కానీ.. ఇంతలోనే ఆ ఏనుగుల గుంపు ఘీంకారాలతో స్పందించాయి. దీంతో అవి సద్దుమణిగే వరకూ అలానే సైలెంట్‌గా బండిలోనే ఉండిపోయాం. మైదానంలో భీకరమైన బౌలర్లని ఎదుర్కోవడం కంటే.. ఈ ఘటన నన్ను ఎక్కువగా భయపెట్టింది’ అని కలువీతర గుర్తు చేసుకున్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.