యాప్నగరం

దివ్యాంగులు క్రీడాస్ఫూర్తితో ఆడారు: సెహ్వాగ్

దివ్యాంగుల్ని క్రీడల్లో ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని భారత డ్యాషింగ్ మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డారు.

TNN 10 Nov 2017, 10:00 am
దివ్యాంగుల్ని క్రీడల్లో ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని భారత డ్యాషింగ్ మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డారు. యూసఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో జరిగిన జాతీయ వీల్‌ఛైర్ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ పోటీల ముగింపు కార్యక్రమానికి సెహ్వాగ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. హైదరాబాద్‌లో జాతీయ స్థాయి పోటీలు నిర్వహించి దివ్యాంగుల్ని ప్రోత్సహించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ఈ మాజీ క్రికెటర్ అభినందనలు తెలిపారు. మహిళల విభాగంలో తమిళనాడు జట్టు విజేతగా నిలవగా.. పురుషుల విభాగంలో మహారాష్ట్ర ఛాంపియన్‌గా నిలిచింది.
Samayam Telugu encourage sports for disabled people in india says virender sehwag
దివ్యాంగులు క్రీడాస్ఫూర్తితో ఆడారు: సెహ్వాగ్


‘ఏ క్రీడాకారుడికైనా కావాల్సింది ప్రోత్సాహం. ముఖ్యంగా దివ్యాంగుల్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి. హైదరాబాద్‌లో ఇంత అద్భుతంగా ఈ క్రీడల్ని తెలంగాణ ప్రభుత్వం నిర్వహించినందుకు చాలా సంతోషంగా ఉంది. దివ్యాంగులు క్రీడా స్ఫూర్తితో ఆడాడు’ అని సెహ్వాగ్ వెల్లడించాడు. ఈ కార్యక్రమానికి క్రీడల శాఖ కార్యదర్శి వెంకటేశం, శాట్స్ ఎండీ దినకర్‌ బాబు, భారత వీల్‌ఛైర్‌ బాస్కెట్‌బాల్‌ సమాఖ్య అధ్యక్షురాలు మాధవీలత తదితరులు హాజరయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.