యాప్నగరం

91 పరుగుల దూరంలో నిలిచిన భారత్

బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో మూడో టెస్టు మూడో రోజు ఆట ముగిసింది.

TNN 18 Mar 2017, 6:39 pm
బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో మూడో టెస్టు మూడో రోజు ఆట ముగిసింది. ఓవర్‌నైట్‌ స్కోరు 120/1తో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన కోహ్లీసేన ఆట ముగిసే సమయానికి 360/6తో నిలిచింది. ఛటేశ్వర్‌ పుజారా (130 బ్యాటింగ్‌; 328 బంతుల్లో 17×4) తన కెరీర్‌లో 11వ శతకం సాధించి అజేయంగా నిలిచాడు. ఓపెనర్‌ మురళీ విజయ్‌ (82; 183 బంతుల్లో 10×4, 1×6) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. ఈ జోడీ రెండో వికెట్‌కు 102 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఇవాళ తొలి రెండు సెషన్లలో టీమిండియా పరుగుల వరద పారించగా.. చివరి సెషన్‌లో ఆస్ట్రేలియా పుంజుకుంది. కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టి.. ఆసీస్ పైచేయి సాధించింది.
Samayam Telugu end of the day 3 of ranchi test
91 పరుగుల దూరంలో నిలిచిన భారత్


ఆసిస్‌ బౌలర్‌ పాల్ కమిన్స్‌ కేవలం 59 పరుగులిచ్చి నాలుగు కీలక వికెట్లు పడగొట్టాడు. అతడు షాట్‌లెంగ్త్‌ బంతులు వేసి కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లీ, అజింక్య రహానె, అశ్విన్‌ను ఔట్‌ చేశాడు. మ్యాచ్‌ను కంగారూల వైపు తిప్పాడు. అశ్విన్‌ను అంపైర్‌ మొదట నాటౌట్‌గా ప్రకటించినా.. ఆసిస్‌ సమీక్ష కోరడంతో ఔటని తేలింది. హేజిల్‌వుడ్‌, స్టీవ్‌ ఒకీఫె.. ఒక్కో వికెట్‌ చొప్పున పడగొట్టారు. ఆసిస్‌ స్కోరును అందుకోవడానికి భారత్ ఇంకా 91 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 4 వికెట్లు ఉన్నాయి. నాలుగో రోజు పిచ్ స్పిన్నర్లకు సహకరించే అవకాశముంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.