యాప్నగరం

ఆ చర్చే.. సఫారీ జట్టుకి ప్లస్ పాయింట్

దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్‌ జట్టు ఎలాంటి ప్రదర్శన ఇవ్వబోతుందోనని అంతా చర్చించుకోవడం తమ జట్టుకి మంచి చేస్తుందని ఫాస్ట్ బౌలర్

TNN 1 Jan 2018, 3:23 pm
దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్‌ జట్టు ఎలాంటి ప్రదర్శన ఇవ్వబోతుందోనని అంతా చర్చించుకోవడం తమ జట్టుకి మంచి చేస్తుందని ఫాస్ట్ బౌలర్ మోర్నీ మోర్కెల్ అభిప్రాయపడ్డాడు. శుక్రవారం నుంచి కేప్ టౌన్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టు జరగనుంది. ఇప్పటికే అక్కడికి చేరుకున్న టీమిండియా.. పరిస్థితులకి అలవాటు పడేందుకు కఠినంగా ప్రాక్టీస్ చేస్తోంది. భారత్ జట్టు సఫారీలతో మూడు టెస్టులు, ఆరు వన్డేలు, మూడు టీ20ల సుదీర్ఘ సిరీస్‌ ఆడనుంది.
Samayam Telugu endurance will be key against indias batting lineup says morne morkel
ఆ చర్చే.. సఫారీ జట్టుకి ప్లస్ పాయింట్


‘ఇలా ఓ సిరీస్‌ గురించి అంతా చర్చించుకోవడం గొప్ప విషయం. ముఖ్యంగా.. ఇక్కడి బౌన్స్‌ పిచ్‌లు గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఇది దక్షిణాఫ్రికా జట్టుకి సిరీస్‌లో సానుకూలాంశం. కానీ.. ఎంత స్వదేశీ పిచ్‌లైనా సరైన ప్రాంతంలో బంతులు వేయడం మా జట్టు బౌలర్లకి తెలియాలి. టెస్టు మ్యాచ్‌లో పరుగులు ఎక్కువగా టీ సెషన్ ముగిసిన తర్వాతే వస్తాయి. కాబట్టి.. అప్పటి వరకు మా జట్టు బౌలర్లు ఉత్సాహం తగ్గకుండా
సహనంతో బౌలింగ్ చేయాలి. అలా చేయగలిగితే.. రోజు ముగిసే సమయానికి భారత్‌ని ఒత్తిడిలోకి నెట్టగలం’ అని మోర్నీ మోర్కెల్ వివరించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.