యాప్నగరం

IND vs ENG ఐదో టెస్టులో పుంజుకున్న భారత బౌలర్లు.. 2 పరుగులు 3 వికెట్లు

Edgbaston Testలో 21 ఓవర్ల పాటు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన టీమిండియా.. కేవలం రెండు పరుగుల వ్యవధిలోనే మూడు వికెట్లు పడగొట్టింది. దాంతో.. ఒక్కసారిగా మ్యాచ్...?

Authored byరాజేంద్ర గాలేటి | Samayam Telugu 4 Jul 2022, 9:40 pm

ప్రధానాంశాలు:

  • ఐదో టెస్టులో ఇంగ్లాండ్ టార్గెట్ 378
  • ఇంగ్లాండ్ ఓపెనర్లు శతక భాగస్వామ్యం
  • వరుస ఓవర్లలో రెండు వికెట్లు తీసిన బుమ్రా
  • అలెక్స్ కామెడీగా రనౌట్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Alex Lees run out  (Pic Credit: BCCI/Twitter)
ఇంగ్లాండ్‌తో బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న ఐదో టెస్టులో భారత్ బౌలర్లు ఎట్టకేలకి పుంజుకున్నారు. మ్యాచ్‌లో నాలుగో రోజైన సోమవారం 378 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లాండ్ టీమ్‌ని తొలుత ఇబ్బంది పెట్టలేకపోయిన భారత బౌలర్లు.. 21 ఓవర్ల పాటు కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. దాంతో.. భారత్ శిబిరంలోనూ కంగారు కనిపించింది. కానీ రెండు పరుగుల వ్యవధిలోనే మూడు వికెట్లు పడగొట్టి ఒక్కసారిగా మళ్లీ మ్యాచ్‌లోకి టీమిండియా వచ్చింది.
ఇంగ్లాండ్ ఓపెనర్లు అలెక్స్ (56: 65 బంతుల్లో 8x4), జాక్ క్రావ్లీ (46: 76 బంతుల్లో 7x4) ఆరంభం నుంచి సహనంతో భారత బౌలర్లని ఎదుర్కొంటూ వచ్చారు. ఆఫ్ స్టంప్‌కి వెలుపల పడే బంతుల్ని వదిలేస్తూ వచ్చిన ఈ ఓపెనింగ్ జోడి 21.4 ఓవర్లలో తొలి వికెట్‌కి 107 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఈ క్రమంలో అలెక్స్ హాఫ్ సెంచరీ నమోదు చేసుకోగా.. జాక్ కూడా అర్ధశతకానికి చేరువయ్యాడు. దాంతో.. భారత కెప్టెన్ బుమ్రా తాను బౌలింగ్ చేయడంతో పాటు మిగిలిన బౌలర్లతోనూ బౌలింగ్ చేయించాడు. అయితే.. చివరికి బుమ్రానే జాక్‌ని బౌల్డ్ చేయడం ద్వారా శతక భాగస్వామ్యాన్ని విడదీశాడు.

జాక్ ఔట్ తర్వాత క్రీజులోకి వచ్చిన ఓలీ పోప్ (0)ని కూడా జస్‌‌ప్రీత్ ఔట్ చేసేయగా.. ఓపెనర్ అలెక్స్ లేని పరుగు కోసం ప్రయత్నిస్తూ రనౌటయ్యాడు. దాంతో.. 107/0 నుంచి ఒక్కసారిగా 109/3తో ఇంగ్లాండ్ ఒత్తిడిలో పడిపోయింది.
రచయిత గురించి
రాజేంద్ర గాలేటి
గాలేటి రాజేంద్ర సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ స్పోర్ట్స్, సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాస్తుంటారు. క్రికెట్ అంటే అమితమైన ఇష్టం. మ్యాచ్‌లకి సంబంధించి ఆసక్తికరమైన కథనాల్ని అందిస్తుంటారు. ఈయనకి జర్నలిజంలో 10 ఏళ్లకి పైగా అనుభవం ఉంది. గతంలో ఈనాడు.నెట్‌లో పనిచేశారు. అంతకముందు జర్నలిజంలో పీజీ చేయడంతో పాటు ఈనాడు జర్నలిజం స్కూల్‌లో శిక్షణ పొందారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.