భారత్, న్యూజిలాండ్ మధ్య సౌథాంప్టన్ వేదికగా జూన్ 18 నుంచి 22 వరకూ ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. కానీ.. ఈ ఫైనల్ ముంగిట న్యూజిలాండ్కి కొత్త టెన్షన్ మొదలైంది. ఆ జట్టు రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మోచేతి గాయం మళ్లీ తిరగబెట్టింది. దాంతో.. గురువారం నుంచి బర్మింగ్హామ్ వేదికగా ఇంగ్లాండ్తో జరగనున్న రెండో టెస్టుకి విలియమ్సన్ దూరమయ్యాడు. అతని స్థానంలో ఓపెనర్ టామ్ లాథమ్ కెప్టెన్గా టీమ్ని నడిపించబోతున్నాడు. వాస్తవానికి గత మూడు నెలలుగా విలియమ్సన్ని మోచేతి గాయం వేధిస్తోంది. ఐపీఎల్ 2021 సీజన్లోనూ ఆరంభ మ్యాచ్లకి ఈ గాయం కారణంగా విలియమ్సన్ దూరంగా ఉన్నాడు. ఇటీవల లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన తొలి టెస్టులోనూ మోచేతి గాయం ఇబ్బందిపెట్టడంతో అతను ఇంజెక్షన్ వేయించుకున్నట్లు తెలుస్తోంది. దాంతో.. టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కి ముందు విలియమ్సన్ గాయంపై రిస్క్ తీసుకోకూడదని భావించిన న్యూజిలాండ్ టీమ్ మేనేజ్మెంట్.. ఇంగ్లాండ్తో రెండో టెస్టు నుంచి అతడ్ని తప్పించింది. ఫైనల్కి అతను ఫిట్నెస్ సాధిస్తాడని కివీస్ కోచ్ గ్యారీ స్టెడ్ చెప్తున్నాడు.
‘‘కేన్ విలియమ్సన్ తొందరలోనే మళ్లీ మైదానంలోకి అడుగుపెడతాడు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే రెండో టెస్టు నుంచి తప్పించాం. వాస్తవానికి ఈ టెస్టులో విలియమ్సన్ ఆడాలని మేము ఆశించాం. కానీ.. జూన్ 18 నుంచి కీలకమైన ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ఉండనుండటంతో.. దాన్ని దృష్టిలో పెట్టుకుని రెస్ట్ ఇచ్చాం’’ అని కోచ్ గ్యారీ స్టెడ్ స్పష్టం చేశాడు.
‘‘కేన్ విలియమ్సన్ తొందరలోనే మళ్లీ మైదానంలోకి అడుగుపెడతాడు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే రెండో టెస్టు నుంచి తప్పించాం. వాస్తవానికి ఈ టెస్టులో విలియమ్సన్ ఆడాలని మేము ఆశించాం. కానీ.. జూన్ 18 నుంచి కీలకమైన ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ఉండనుండటంతో.. దాన్ని దృష్టిలో పెట్టుకుని రెస్ట్ ఇచ్చాం’’ అని కోచ్ గ్యారీ స్టెడ్ స్పష్టం చేశాడు.