యాప్నగరం

పాకిస్థాన్‌తో టీ20 సిరీస్‌కి ఇంగ్లాండ్ టీమ్ ప్రకటన

పాకిస్థాన్‌తో ప్రస్తుతం టెస్టు సిరీస్ ఆడుతున్న ఇంగ్లాండ్ టీమ్.. ఈ నెల ఆఖర్లో మూడు టీ20ల సిరీస్‌లోనూ ఢీకొట్టనుంది. ఈ మేరకు 14 మందితో కూడిన టీ20 జట్టుని ఈసీబీ ఈరోజు ప్రకటించింది.

Samayam Telugu 19 Aug 2020, 1:29 pm
పాకిస్థాన్‌తో మూడు టీ20ల సిరీస్‌ కోసం 14 మందితో కూడిన జట్టుని ఇంగ్లాండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) తాజాగా ప్రకటించింది. మాంచెస్టర్ వేదికగా ఈ నెల 28 నుంచి ఈ సిరీస్ ప్రారంభంకానుండగా.. కరోనా వైరస్ నేపథ్యంలో.. మూడు మ్యాచ్‌లూ అదే వేదికగానే వరుసగా 28, 30, సెప్టెంబరు 1న జరిగేలా ఈసీబీ షెడ్యూల్ రూపొందించింది.
Samayam Telugu Chris Jordan
Chris Jordan. (Reuters Photo)


ఇంగ్లాండ్ టీ20 జట్టు: ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), మొయిన్ అలీ, బెయిర్‌స్టో, టామ్ బాటన్, శామ్ బిల్లింగ్స్, టామ్ కరన్, జో డెన్లీ, లూయిస్ గ్రెగొరీ, క్రిస్ జోర్దాన్, షకీబ్ మహ్మద్, డేవిడ్ మలాన్, ఆదిల్ రషీద్, జేసన్ రాయ్, డేవిడ్ విల్లీ.

ఇంగ్లాండ్, పాకిస్థాన్ మధ్య ఈ నెల 5న మూడు టెస్టుల సిరీస్ ప్రారంభమవగా.. ఇప్పటికే రెండు టెస్టులు ముగిశాయి. మాంచెస్టర్‌లో జరిగిన తొలి టెస్టులో 3 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ గెలుపొందగా.. రెండో టెస్టు మ్యాచ్ వర్షం కారణంగా డ్రాగా ముగిసింది. ఇక మూడో టెస్టు మ్యాచ్‌ సౌథాంప్టన్ వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభంకానుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.