యాప్నగరం

ఇంగ్లాండ్‌లో టీమిండియా పర్యటన ఖరారు..!

ఇంగ్లాండ్‌లో భారత్ జట్టు పర్యటన ఖరారైంది. 2019 ప్రపంచకప్‌కి ఇంగ్లాండ్‌ ఆతిథ్యమివ్వనున్న నేపథ్యంలో వచ్చే

TNN 5 Sep 2017, 5:02 pm
ఇంగ్లాండ్‌లో భారత్ జట్టు పర్యటన ఖరారైంది. 2019 ప్రపంచకప్‌కి ఇంగ్లాండ్‌ ఆతిథ్యమివ్వనున్న నేపథ్యంలో వచ్చే ఏడాది జులై నుంచి అక్కడ టీమిండియా దాదాపు రెండు నెలల పాటు పర్యటించనుంది. సుదీర్ఘ సిరీస్‌లో భాగంగా భారత్ మూడు టీ20, మూడు వన్డేలతో పాటు ఐదు టెస్టులను ఆతిథ్య జట్టుతో ఆడనుంది. జులై 3న టీ20తో ఆరంభమయ్యే ఈ సిరీస్ సెప్టెంబరు 11 వరకు కొనసాగనుంది.
Samayam Telugu england announce blockbuster india tour for 2018
ఇంగ్లాండ్‌లో టీమిండియా పర్యటన ఖరారు..!


‘భారత్‌, ఇంగ్లాండ్ మధ్య వచ్చే ఏడాది జరిగే ఐదు టెస్టుల సిరీస్‌ అంతర్జాతీయ క్రికెట్‌కే హైలెట్‌గా మారనుంది. రెండు బలమైన జట్ల మధ్య జరిగే ఈ పోటీకి అభిమానుల నుంచి పెద్ద సంఖ్యలో ఆదరణ కూడా లభించొచ్చు’ అని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు సీఈవో టామ్ హరీసన్ ధీమా వ్యక్తం చేశారు. గత ఏడాది భారత్‌లో పర్యటించిన ఇంగ్లాండ్ జట్టు టెస్టుల్లో పేలవ ప్రదర్శనతో నిరాశపరిచింది. అయితే.. సొంతగడ్డపై మాత్రం ఇంగ్లాండ్ టెస్టుల్లో ఏ జట్టుకైనా సవాల్ విసరగలదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.