యాప్నగరం

ఇంగ్లాండ్ చేతిలో శ్రీలంకకి తప్పని వైట్‌వాష్..!

ఈ టెస్టు సిరీస్‌ కంటే ముందు జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ని 3-1తో చేజిక్కించుకున్న ఇంగ్లాండ్.. ఆ తర్వాత జరిగిన ఏకైక టీ20 మ్యాచ్‌లోనూ గెలుపొందిన విషయం తెలిసిందే.

Samayam Telugu 26 Nov 2018, 4:25 pm
శ్రీలంకకి సొంతగడ్డపై ఇంగ్లాండ్ చేతిలో ఘోర పరాభవం ఎదురైంది. ఇప్పటికే లంకేయుల్ని వన్డే, టీ20 సిరీస్‌ల్లో ఓడించిన ఇంగ్లాండ్ జట్టు.. ఈరోజు ముగిసిన మూడు టెస్టుల సిరీస్‌నీ 3-0తో క్లీన్‌స్వీప్ చేసేసింది. ఆటలో నాలుగో రోజైన సోమవారం 327 పరుగుల లక్ష్య ఛేదనని కొనసాగించిన శ్రీలంక జట్టు 284 పరుగులకే కుప్పకూలిపోయింది. ఇంగ్లాండ్ స్పిన్నర్ మొయిన్ అలీ (4/92), జాక్ లెక్ (4/72) చెలరేగడంతో శ్రీలంక జట్టులో కుశాల్ మెండిస్ (86), రోశన్ సిల్వా (65), పుష్పకుమార (42 నాటౌట్) మినహా ఎవరూ రాణించలేకపోయారు. దీంతో.. 42 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ అలవోకగా గెలుపొందింది. ఈ టెస్టు సిరీస్‌ కంటే ముందు జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ని 3-1తో చేజిక్కించుకున్న ఇంగ్లాండ్.. ఆ తర్వాత జరిగిన ఏకైక టీ20 మ్యాచ్‌లోనూ గెలుపొందిన విషయం తెలిసిందే.
Samayam Telugu england beat sri lanka sweep test series 3 0
ఇంగ్లాండ్ చేతిలో శ్రీలంకకి తప్పని వైట్‌వాష్..!


కొలంబో వేదికగా శుక్రవారం ఆరంభమైన ఈ టెస్టులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు బెయిర్‌స్టో (110: 186 బంతుల్లో 9x4, 1x6) శతకం బాదడంతో తొలి ఇన్నింగ్స్‌లో 336 పరుగులు చేసింది. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన శ్రీలంక జట్టు 240 పరుగులకే కుప్పకూలిపోగా.. ఇంగ్లాండ్‌కి 96 పరుగుల తొలి ఇన్నింగ్స్ లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌‌లో ఇంగ్లాండ్ జట్టు 230 పరుగులకి ఆలౌటవగా.. శ్రీలంక ముందు 327 పరుగుల లక్ష్యం నిలిచింది. అయితే.. ఈ భారీ లక్ష్య ఛేదనని 82/5తో పేలవ రీతిలో ఆరంభించిన లంక.. ఏ దశలోనూ విజయం దిశగా సాగలేకపోయింది. ఆఖర్లో పుష్పకుమార (42 నాటౌట్: 40 బంతుల్లో 6x4, 1x6) కాసేపు మెరుపులు మెరిపించి.. సొంతగడ్డపై అభిమానుల్ని అలరించాడు. ఈ మ్యాచ్‌తో శ్రీలంక గడ్డపై ఇంగ్లాండ్ పర్యటన ముగిసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.