యాప్నగరం

లార్డ్స్ టెస్ట్: ఇంగ్లాండ్‌కు ‘ఆసియా’ కలవరం!

లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌, భారత్ మధ్య రెండో టెస్టు నేడు ప్రారంభం కానుంది. ఆతిథ్య జట్టును ‘ఆసియా’ రికార్డ్ కలవరపెడుతోంది

Samayam Telugu 9 Aug 2018, 11:28 am
లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌, భారత్ మధ్య రెండో టెస్టు నేడు (గురువారం) ప్రారంభం కానుంది. తొలి టెస్టులో 31 పరుగుల తేడాతో ఓడిన భారత్.. ఈ టెస్టులో ఎలాగైనా గెలవాలనే కసితో బరిలో దిగనుంది. జట్టులో ఇద్దరు స్పిన్నర్లకు చోటు కల్పించే ఛాన్స్ ఉంది. తొలి టెస్టులో పక్కనబెట్టిన పుజారాను లార్డ్స్ టెస్టులో ఆడించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ వేదికపై భారత్ ఇప్పటి వరకూ 17 టెస్టులు ఆడగా కేవలం రెండింట్లోనే విజయం సాధించింది. 11 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది.
Samayam Telugu lords1


కానీ లార్డ్స్ వేదికగా ఆసియా దేశాలతో జరిగిన చివరి ఐదు టెస్టుల్లో ఇంగ్లాండ్ గెలవలేకపోయింది. పాక్, భారత్ చేతుల్లో ఓడిన ఆతిథ్య జట్టు.. శ్రీలంకతో రెండు టెస్టులను డ్రా చేసుకుంది. భారత బ్యాట్స్‌‌మెన్ కొంచెం కష్టపడితే ఈ పిచ్ మీద విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అంతేకాకుండా.. ఇంగ్లాండ్ జట్టు 2010 జనవరి నుంచి ఇప్పటి వరకూ లార్డ్స్‌లో మూడుసార్లు 200 పరుగుల్లోపు ఆలౌట్ అయ్యింది.

ఎడ్జ్‌బాస్టన్‌లో ఆసియా జట్టేది గెలుపొందలేదనే ఆనవాయితీ మరోసారి నిజమైంది. తొలి టెస్టులో భారత్ 31 పరుగుల తేడాతో ఓడింది. మరి లార్డ్స్‌లో ఇటీవల ఆసియా జట్లకు తిరుగులేని రికార్డ్ ఉండగా.. దాన్ని కూడా కోహ్లి సేన కంటిన్యూ చేస్తుందేమో చూడాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.