యాప్నగరం

ఇంగ్లాండ్ తొలి వికెట్ కూల్చిన అశ్విన్

వైజాగ్ టెస్టులో భారత జట్టు ఇంగ్లండ్‌కు 405 పరుగులు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. దీంతో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు మ్యాచ్ ను డ్రా చేసే దిశగా నెమ్మదిగా వికెట్లు నష్టపోకుండా జాగ్రత్తగా ఆడుతోంది...

TNN 20 Nov 2016, 4:19 pm
వైజాగ్ టెస్టులో భారత జట్టు ఇంగ్లండ్‌కు 405 పరుగులు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. దీంతో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు మ్యాచ్ ను డ్రా చేసే దిశగా నెమ్మదిగా వికెట్లు నష్టపోకుండా జాగ్రత్తగా ఆడుతోంది. 50 ఓవర్ల వరకు వికెట్ నష్టపోకుండా 75 పరుగులు మాత్రమే చేసింది. ఎట్టకేలకు 50.2 ఓవర్ వద్ద భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ , ఇంగ్లాండ్ ఓపెనర్ హమీద్ ను ఎల్ బీడబ్ల్యూగా పెవీలియన్ చేర్చాడు. 144 బంతులు అడిన హమీద్ 25 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో ఇంగ్లాండ్ కెప్టెన్ కుక్ 47 పరుగులతో, రూట్ 2 పరుగులతో ఆడుతున్నారు.
Samayam Telugu england vs india ashwin makes break through
ఇంగ్లాండ్ తొలి వికెట్ కూల్చిన అశ్విన్


అంతకు ముందు తొలి ఇన్నింగ్స్‌లో సత్తా చాటిన టీమిండియా బ్యాట్స్‌మెన్ రెండో ఇన్నింగ్స్‌లో చేతులెత్తేశారు. దీంతో మలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టు 204 పరుగులకే ఆలౌట్ అయ్యింది. మొదటి ఇన్నింగ్స్‌లో భారీ శతకం చేసి విరాట్ కోహ్లి సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ 81 రన్స్ చేసి జట్టును ఆదుకున్నాడు. మరో సెంచరీ దిశగా సాగుతున్న అతణ్ని రషీద్ అవుట్ చేశాడు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.