ఇంగ్లాండ్ టూర్లో శ్రీలంకకి వరుసగా రెండో పంచ్ తగిలింది. ఇప్పటికే ఇంగ్లాండ్ చేతిలో తొలి టీ20లో ఓడిన శ్రీలంక. తాజాగా కార్డిఫ్ వేదికగా జరిగిన రెండో టీ20లోనూ పేలవ పరాజయాన్ని చవిచూసింది. వర్షం కారణంగా మ్యాచ్ని 18 ఓవర్లకి అంపైర్లు కుదించగా. మూడు టీ20ల సిరీస్ని ఒక మ్యాచ్ మిగిలిన ఉండగానే ఇంగ్లాండ్ కైవసం చేసుకుంది. మ్యాచ్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది. ఆ జట్టులో కుశాల్ మెండిస్ (39: 39 బంతుల్లో 3x4, 1x6) టాప్ స్కోరర్గా నిలవగా.. ఇంగ్లాండ్ టీమ్లో మార్క్వుడ్, ఆదిల్ రషీద్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. శామ్ కరన్, క్రిస్ జోర్దాన్కి చెరొక వికెట్ తీశారు.
అనంతరం ఇంగ్లాండ్ టీమ్ ఛేదనకు దిగగా.. వర్షం కారణంగా మ్యాచ్కి అంతరాయం ఏర్పడింది. దాంతో.. డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 18 ఓవర్లకి మ్యాచ్ని కుదించిన అంపైర్లు.. లక్ష్యాన్ని 103 పరుగులకి సవరించారు. ఛేదనలో ఓపెనర్ జేసన్ రాయ్ (17), శామ్ బిల్లింగ్ (24), లివింగ్స్టోన్ (29) దూకుడుగా ఆడటంతో ఇంగ్లాండ్ 16.1 ఓవర్లలోనే 108/5తో విజయాన్ని అందుకుంది. ఇక నామమాత్రమైన మూడో టీ20 మ్యాచ్ శనివారం జరగనుండగా.. ఆ తర్వాత మంగళవారం నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభంకానుంది.
అనంతరం ఇంగ్లాండ్ టీమ్ ఛేదనకు దిగగా.. వర్షం కారణంగా మ్యాచ్కి అంతరాయం ఏర్పడింది. దాంతో.. డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 18 ఓవర్లకి మ్యాచ్ని కుదించిన అంపైర్లు.. లక్ష్యాన్ని 103 పరుగులకి సవరించారు. ఛేదనలో ఓపెనర్ జేసన్ రాయ్ (17), శామ్ బిల్లింగ్ (24), లివింగ్స్టోన్ (29) దూకుడుగా ఆడటంతో ఇంగ్లాండ్ 16.1 ఓవర్లలోనే 108/5తో విజయాన్ని అందుకుంది. ఇక నామమాత్రమైన మూడో టీ20 మ్యాచ్ శనివారం జరగనుండగా.. ఆ తర్వాత మంగళవారం నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభంకానుంది.