యాప్నగరం

ఇంగ్లాండ్, వెస్టిండీస్ మధ్య ఈరోజే ‘ఫైనల్’ టెస్టు

తొలి టెస్టులో ఆతిథ్య ఇంగ్లాండ్‌‌ని బెదరగొట్టిన వెస్టిండీస్.. రెండో టెస్టు మాత్రం చేతులెత్తేసింది. కానీ.. మూడో టెస్టులో గెలవడడం ద్వారా 32 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకి తెరదించాలని కరీబియన్లు ఆశిస్తున్నారు.

Samayam Telugu 24 Jul 2020, 12:11 pm
ఇంగ్లాండ్, వెస్టిండీస్ మధ్య మాంచెస్టర్ వేదికగా ఈరోజే ఆఖరి టెస్టు మ్యాచ్ జరగనుంది. మూడు టెస్టుల ఈ సిరీస్‌‌‌లో భాగంగా సౌథాంప్టన్ వేదికగా జరిగిన ఫస్ట్ టెస్టులో 4 వికెట్ల తేడాతో గెలుపొందిన వెస్టిండీస్.. ఆతిథ్య ఇంగ్లాండ్‌కి ఊహించని షాకిచ్చింది. కానీ.. మాంచెస్టర్‌లో జరిగిన రెండో టెస్టులో పుంజుకున్న ఇంగ్లాండ్ ఏకంగా 113 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుని సిరీస్‌ని 1-1తో సమం చేసింది. దాంతో విజేత నిర్ణయాత్మక ఆఖరి టెస్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొనగా.. ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటలకి మ్యాచ్ ప్రారంభంకానుంది.
Samayam Telugu England v West Indies


ఇంగ్లాండ్ గడ్డపై 1988లో ఆఖరిగా టెస్టు సిరీస్‌ గెలిచిన వెస్టిండీస్ టీమ్.. గత 32 ఏళ్లుగా టెస్టు సిరీస్ విజయం కోసం నిరీక్షిస్తోంది. అయితే.. సౌథాంప్టన్ టెస్టులో పోరాట పటిమతో ఆకట్టుకున్న విండీస్.. సిరీస్‌లో ఆధిక్యం సాధించడం ద్వారా చరిత్ర సృష్టించేలా కనిపించింది. కానీ.. రెండో టెస్టులో బెన్‌స్టోక్స్.. రెండు ఇన్నింగ్స్‌ల్లో 176, 78 పరుగులు, 3 వికెట్లు పడగొట్టడం ద్వారా విండీస్‌కి గెలిచే అవకాశం ఇవ్వలేదు. దాంతో.. మూడో టెస్టులో పోరు బెన్‌స్టోక్స్ vs వెస్టిండీస్‌లా జరగనుంది.

మూడో టెస్టుకి వర్షం అంతరాయం కలిగించే సూచనలు కనిపిస్తున్నాయి. తొలి రెండు రోజులు పిచ్ పేస్‌కి అనుకూలించనుండగా.. చివరి రోజు స్పిన్నర్లకి సహకరించే అవకాశం కనిపిస్తోంది. దాంతో.. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్‌ ఎంచుకునే ఛాన్స్‌లు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.