యాప్నగరం

కంగారూలని కసితీరా ఓడించిన ఇంగ్లాండ్

ఆస్ట్రేలియాపై ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌ ఓటమికి ఇంగ్లాండ్ బదులు తీర్చుకుంది. పెర్త్ వేదికగా జరిగిన ఐదో వన్డేలో 12

TNN 29 Jan 2018, 4:57 pm
ఆస్ట్రేలియాపై ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌ ఓటమికి ఇంగ్లాండ్ బదులు తీర్చుకుంది. పెర్త్ వేదికగా జరిగిన ఐదో వన్డేలో 12 పరుగుల తేడాతో గెలుపొందిన ఇంగ్లాండ్ జట్టు ఐదు వన్డేల సిరీస్‌ని 4-1తో కైవసం చేసుకుంది. ఈ సిరీస్ కంటే ముందు జరిగిన యాషెస్‌ టెస్టు సిరీస్‌ని 4-1 తేడాతో ఆస్ట్రేలియా చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ వన్డేలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లాండ్‌ని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. జో రూట్ (62: 68 బంతుల్లో 2x4), జేసన్ రాయ్ (49: 46 బంతుల్లో 7x4, 1x6) కీలక ఇన్నింగ్స్ ఆడటంతో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 47.4 ఓవర్లలో 259 పరుగులకి ఆలౌటైంది.
Samayam Telugu england win series 4 1 as australia fail to chase 260
కంగారూలని కసితీరా ఓడించిన ఇంగ్లాండ్


లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (15), ట్రావిస్ హెడ్ (22) విఫలమైనా.. స్టాయినిస్ (87: 99 బంతుల్లో 6x4, 4x6) అర్ధశతకంతో కంగారూలను గెలిపించేలా కనిపించాడు. కానీ.. జట్టు స్కోరు 189 వద్ద అతను ఔటవ్వగానే ఆసీస్ ఒత్తిడిలో వరుసగా వికెట్లని చేజార్చుకుంది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ (12), మిచెల్ మార్ష్ (13), మాక్స్‌వెల్ (34), టిమ్ పైనీ (34) నిరాశపరిచారు. దీంతో 48.2 ఓవర్లలో 247 పరుగులకే ఆస్ట్రేలియా జట్టు కుప్పకూలిపోయింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.