యాప్నగరం

Team Indiaతో ఐదో టెస్టుకి తుది జట్టుని ప్రకటించేసిన ఇంగ్లాండ్

IND vs ENG 5th Test కోసం ఒక్కరోజు ముందే ఇంగ్లాండ్ తుది జట్టుని ప్రకటించేసింది. టీమ్‌లోకి సీనియర్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ రీఎంట్రీ ఇవ్వగా.. వికెట్ కీపర్‌గా శామ్ బిల్లింగ్స్ వ్యవహరించబోతున్నాడు.

Authored byరాజేంద్ర గాలేటి | Samayam Telugu 30 Jun 2022, 5:05 pm
Samayam Telugu England Test Squad (Pic Source: Twitter)
భారత్‌తో బర్మింగ్‌హామ్ వేదికగా శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకి ప్రారంభంకానున్న ఐదో టెస్టు కోసం ఇంగ్లాండ్ తుది జట్టుని ఈరోజే ప్రకటించేసింది. బెన్‌స్టోక్స్ నడిపించబోతున్న ఈ టీమ్‌లోకి జేమ్స్ అండర్సన్ రీఎంట్రీ ఇవ్వగా.. లేట్‌గా జట్టులోకి ఎంపికైన శామ్ బిల్లింగ్స్‌‌కి కూడా తుది జట్టులో చోటు దక్కింది. ఐదు టెస్టుల ఈ సిరీస్‌లో గత ఏడాది నాలుగు మ్యాచ్‌లు ముగియగా.. భారత్ జట్టు 2-1తో ఆధిక్యంలో నిలిచింది. కానీ.. ఐదో టెస్టు ముంగిట టీమిండియా‌లో కరోనా కేసులు రావడంతో అప్పట్లో వాయిదాపడిన టెస్టు మ్యాచ్‌ని శుక్రవారం నుంచి నిర్వహించబోతున్నారు.

ఐదో టెస్టుకి ఇంగ్లాండ్ తుది జట్టు ఇదే: అలెక్స్ లీస్, జాక్ క్రావ్లీ, ఓలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్‌స్టోక్స్ (కెప్టెన్), శామ్ బిల్లింగ్స్ (వికెట్ కీపర్), మాథ్యూ పోట్స్, స్టువర్ట్ బ్రాడ్, జాక్ లీచ్, జేమ్స్ అండర్సన్

భారత్ తుది జట్టు విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. కెప్టెన్ రోహిత్ శర్మకి బుధవారం నిర్వహించిన కరోనా పరీక్షల్లోనూ పాజిటివ్‌గా తేలింది. దాంతో.. ఐదో టెస్టులో అతను ఆడటంపై సందిగ్ధత నెలకొనగా.. జస్‌ప్రీత్ బుమ్రా చేతికి టీమ్ పగ్గాలు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తంగా.. 17 మందితో కూడిన జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది.

టెస్టు టీమ్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, మయాంక్ అగర్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, చతేశ్వర్ పుజారా, హనుమ విహారి, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), శ్రీకర్ భరత్ (రిజర్వ్ వికెట్ కీపర్), శార్ధూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, ప్రసీద్ కృష్ణ
రచయిత గురించి
రాజేంద్ర గాలేటి
గాలేటి రాజేంద్ర సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ స్పోర్ట్స్, సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాస్తుంటారు. క్రికెట్ అంటే అమితమైన ఇష్టం. మ్యాచ్‌లకి సంబంధించి ఆసక్తికరమైన కథనాల్ని అందిస్తుంటారు. ఈయనకి జర్నలిజంలో 10 ఏళ్లకి పైగా అనుభవం ఉంది. గతంలో ఈనాడు.నెట్‌లో పనిచేశారు. అంతకముందు జర్నలిజంలో పీజీ చేయడంతో పాటు ఈనాడు జర్నలిజం స్కూల్‌లో శిక్షణ పొందారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.