యాప్నగరం

ధోనీకి 80 ఏళ్లొచ్చినా, వీల్‌ఛైర్లో ఉన్నా..: డివిలియర్స్

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై ఏబీ డివిలియర్స్ ప్రశంసల వర్షం కురిపించాడు. ధోనీ రిటైర్మెంట్ ప్రస్తావన తీసుకురాగా.. తనదైన శైలిలో బదులిచ్చారు.

Samayam Telugu 22 Oct 2018, 3:12 pm
మహేంద్ర సింగ్ ధోనీ.. భారత మిడిలార్డర్‌కు చాలా ఏళ్లపాటు వెన్నెముకగా నిలిచాడు. కెప్టెన్‌గా, బ్యాట్స్‌మెన్‌గా జట్టుకు తిరుగులేని విజయాలు అందించాడు. విరాట్ కోహ్లికి అవకాశం ఇవ్వడం కోసం ధోనీ కెప్టెన్సీ పగ్గాలను వదిలేశాడు. వయసు ప్రభావంతో మహీ గతంలో మాదిరిగా భారీ షాట్లు ఆడలేకపోతున్నాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన ధోనీ 156 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో వచ్చే ప్రపంచ కప్‌లో ధోనీ స్థానంపై అనుమానాలు తలెత్తుతున్నాయి.
Samayam Telugu dhoni abd


బ్యాటింగ్‌లో మహీ సత్తా చాటుతుండకపోవచ్చు. కానీ మైదానంలో వ్యూహాలు రూపొందించడంలో మాత్రం ఇప్పటికీ అతడి తర్వాతే ఎవరైనా. వికెట్ల వెనుకాల అతడిలో చురుకుదనం మాత్రం ఇసుమంతైనా తగ్గలేదు. జట్టులో అతడు ఉన్నాడంటే ఇతర ఆటగాళ్లకు భరోసా.

ధోనీ క్రికెట్‌కు వీడ్కోలు పలికే తరుణం ఆసన్నమైందా అని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్‌ను అడగ్గా.. ఏబీ తనదైన శైలిలో బదులిచ్చాడు. ‘‘ధోనీకి 80 ఏళ్లు వచ్చినా.. నా ఆల్ టైం డ్రీం ఎలెవన్‌లో స్థానం కల్పిస్తా. వీల్‌చైర్లో ఉన్న ధోనీ నా జట్టు తరఫున బరిలో దిగుతాడు. అతడు అద్భుతమైన ఆటగాడు, ఓసారి ధోనీ రికార్డులను చూడండి. అలాంటి ఆటగాణ్ని తప్పించాలని అనుకుంటారా? నేనైతే ఎప్పటికీ ఆ పని చేయన’’ని డివిలియర్స్ చెప్పాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.