యాప్నగరం

రోహిత్ శర్మకు పాదాభివందనం చేసిన ఫ్యాన్.. ఆ భక్తి చూశారా!

Rohit Sharma Fan: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో అనూహ్య ఘటన జరిగింది. టీమిండియా కెప్టెన్ రోహిత్‌ శర్మ ఫ్యాన్ ఒకరు భద్రతా సిబ్బంది కళ్లుగప్పి మైదానంలోకి పరుగెత్తుకొచ్చాడు. నేరుగా రోహిత్ శర్మ వద్దకు వచ్చి పాదాభివందనం చేశాడు. అనంతరం రోహిత్‌ శర్మను రిక్వెస్ట్ చేసి సెల్ఫీ తీసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. మ్యాచ్ జరిగిన గ్రీన్‌ఫీల్డ్ స్టేడియం పరిసరాల్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల భారీ హోర్డింగులను ఏర్పాటు చేశారు.

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 30 Sep 2022, 11:59 am
తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్‌ ఇంటర్నేషనల్ గ్రౌండ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్‌ శర్మ (Rohit Sharma) ఫ్యాన్ ఒకరు భద్రతా సిబ్బంది కళ్లుగప్పి మైదానంలోకి పరుగెత్తుకొచ్చాడు. నేరుగా రోహిత్ శర్మ వద్దకు వచ్చి పాదాభివందనం చేశాడు. అనంతరం రోహిత్‌ను రిక్వెస్ట్ చేసి సెల్ఫీ తీసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. దక్షిణాఫ్రికాపై టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న రోహిత్.. అప్పుడే క్రీజులోకి అడుగుపెడుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ పరిణామానికి రోహిత్ సహా ఆటగాళ్లందరూ ఆశ్చర్యపోయారు.
Samayam Telugu Fan breaches security during 1st T20 to meet Rohit Sharma
రోహిత్ శర్మ ఫ్యాన్


సదరు అభిమాని చెప్పులు లేకుండా మైదానంలోకి రావడం గమనార్హం. ‘తన దేవుడిని కలిసి, కాళ్లు మొక్కేందుకు ఆ ఫ్యాన్ చెప్పులు లేకుండా మైదానంలోకి వచ్చాడు చూశారా.. అది నిజమైన భక్తి’ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

ఈ ఘటన భద్రతా వైఫల్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది సదరు అభిమానిని వెంటనే అక్కడి నుంచి బయటకి పంపించి వేశారు. గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ క్రికెట్ మైదానం చుట్టూ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల భారీ కటౌట్లను అభిమానులు ఏర్పాటు చేశారు. అయితే, ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ డకౌట్ అయ్యి ఫ్యాన్స్‌ను నిరాశ పరిచాడు.


మూడు టీ20ల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో సఫారీలను టీమిండియా చిత్తు చేసిన సంగతి తెలిసిందే. యువ బౌలర్లు అర్ష్‌దీప్ సింగ్, దీపక్ చాహర్ అద్భుత ప్రదర్శనతో తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా ఆదిలోనే కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. అనంతరం భారత్‌ 16.4 ఓవర్లలో 110 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. చివర్లో 6 పరుగులు చేయాల్సి ఉన్న సమయంలో కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ ప్రణాళిక ప్రకారం ఆడి 10 పరుగులు చేసి ఇద్దరూ అర్ధ శతకాలను పూర్తి చేసుకోవడం విశేషం.
రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.