యాప్నగరం

సండే ట్వీట్‌తో నెటిజన్లకి దొరికిన మంజ్రేకర్

మంజ్రేకర్ ఏం మాట్లాడినా.. నెటిజన్లు అతడ్ని ట్రోల్ చేయడం కామన్‌గా మారిపోయింది. అలాంటిది ఈరోజు సండే.. అంటూ అందరికీ గుర్తు చేసే ప్రయత్నం చేస్తే..? ఊరుకుంటారా..? ఉతికారేస్తున్నారు.

Samayam Telugu 29 Mar 2020, 8:38 pm
టీమిండియా మాజీ బ్యాట్స్‌మెన్, క్రికెట్ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ మరోసారి నెటిజన్లకి దొరికిపోయాడు. నోటి దురుసు కారణంగా ఇటీవల భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కామెంట్రీ ఫ్యానల్‌లో చోటు కోల్పోయిన మంజ్రేకర్.. ప్రస్తుతం ఇంటి దగ్గర ఉంటున్నాడు. ఈ క్రమంలో మంజ్రేకర్ చేసిన ఓ ట్వీట్‌కి అభిమానులు పెద్ద ఎత్తున సెటైర్లు పేలుస్తున్నారు. ఇంతకీ అతను చేసిన ట్వీట్ ఏంటంటే..? ‘‘ఈరోజు ఆదివారం.. జస్ట్ చెప్తున్నానంతే’’. మంజ్రేకర్ ట్వీట్‌తో నెటిజన్లకి మండిపోయింది. హా.. నువ్వు చెప్పాలి మరి ఈరోజు సండే అని అంటూ పెద్ద ఎత్తున చురకలేస్తున్నారు.
Samayam Telugu Sanjay Manjrekar



2019 వన్డే ప్రపంచకప్ సమయంలో రవీంద్ర జడేజాని అరకొర ఆటగాడంటూ కామెంట్ చేసిన మంజ్రేకర్.. ఆ తర్వాత కూడా సహచర కామెంటేటర్ హర్షా భోగ్లేని లైవ్‌లోనే అవమానించాడు. దీంతో.. బీసీసీఐకి పెద్ద ఎత్తున మంజ్రేకర్‌పై ఫిర్యాదులు అందాయి. కామెంట్రీ బాక్స్‌లో మంజ్రేకర్ ఉంటే.. తాము టీవీని మ్యూట్‌లో పెట్టుకుంటున్నట్లు చాలా మంది నెటిజన్లు బీసీసీఐకి తెలియజేశారు. దీంతో.. దిద్దుబాటు చర్యలకి దిగిన బీసీసీఐ.. అతడ్ని కామెంట్రీ ఫ్యానల్‌ నుంచి తప్పించింది. దీంతో.. ఇకపై టీమిండియా ఆడే మ్యాచ్‌లకి మంజ్రేకర్ కామెంట్రీ చెప్పబోడు.

వివాదాలకి మంజ్రేకర్ గత మూడేళ్లుగా కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయాడు. 2018 ఐపీఎల్ సమయంలో ముంబయి ఇండియన్స్ హిట్టర్ ఆండ్రీ రసెల్‌ని బుర్రలేని క్రికెటర్ అంటూ ఎద్దేవా చేసి మొట్టికాయలు వేయించుకున్న మంజ్రేకర్.. ఆ తర్వాత కూడా తరచూ నోరు జారుతూ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. కానీ.. ఇన్నాళ్లు మౌనంగా చూస్తుండిపోయిన బీసీసీఐ.. ఇటీవల కఠిన చర్యలకి ఉపక్రమించి వేటు వేసింది.







తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.