ఆస్ట్రేయాతో జరిగిన తొలి రెండు వన్డేల్లో ఓడిన భారత్.. మూడో వన్డేలో విజయం సాధించి పరువు దక్కించుకుంది. గత రెండు మ్యాచ్ల్లో విఫలమైన సైనీ స్థానంలో నటరాజన్ను తుది జట్టులోకి తీసుకున్న కోహ్లి.. షమీకి విశ్రాంతినిచ్చి శార్దుల్ ఠాకూర్ను ఆడించాడు. మయాంక్ స్థానంలో గిల్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ మార్పులతోపాటు.. ఆసీస్ జట్టులో వార్నర్ లేకపోవడం టీమిండియాకు కలిసొచ్చింది.
తొలి రెండు వన్డేల్లోనూ 62 బంతుల్లోనే శతకాలు బాదిన స్టీవ్ స్మిత్.. మూడో వన్డేలో 7 పరుగులకే వెనుదిరిగాడు. రెండో వన్డే అనంతరం గంభీర్ మట్లాడుతూ.. స్మిత్ ప్యూర్ క్లాస్ ఆటగాడని కొనియాడాడు. వరుసగా రెండు సెంచరీలు బాదిన స్మిత్ ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్మెన్ అయిన కోహ్లికి చేరువలో ఉన్నాడని గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానించాడు.
గౌతీ ఈ వ్యాఖ్యలు చేసిన మరుసటి మ్యాచ్లోనే స్మిత్ విఫలం కావడం.. కోహ్లి 63 పరుగులతో రాణించడం.. అంతకు మించి భారత్ గెలవడంతో ఫ్యాన్స్ గంభీర్ను ట్రోల్ చేస్తున్నారు. గంభీర్ వల్లే భారత్ గెలిచిందని సెటైర్లు వేస్తున్నారు. ఐపీఎల్ ఫైనల్కు ముందు గంభీర్ స్టోయినిస్ను పొగడగా.. తర్వాతి మ్యాచ్లోనే అతడు విఫలమయ్యాడని.. ఇప్పుడు స్మిత్ విషయంలో అదే జరిగిందంటున్నారు. ఇక మ్యాక్స్వెల్ను కూడా పొగిడితే బాగుంటుందంటున్నారు.
తొలి రెండు వన్డేల్లోనూ 62 బంతుల్లోనే శతకాలు బాదిన స్టీవ్ స్మిత్.. మూడో వన్డేలో 7 పరుగులకే వెనుదిరిగాడు. రెండో వన్డే అనంతరం గంభీర్ మట్లాడుతూ.. స్మిత్ ప్యూర్ క్లాస్ ఆటగాడని కొనియాడాడు. వరుసగా రెండు సెంచరీలు బాదిన స్మిత్ ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్మెన్ అయిన కోహ్లికి చేరువలో ఉన్నాడని గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానించాడు.