యాప్నగరం

చివరి టీ20.. కొంచెం లౌక్యంతో ఆడండి..!

భారత్‌తో కేప్‌టౌన్ వేదికగా శనివారం రాత్రి 9.30 నుంచి జరగనున్న చివరి టీ20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ లౌక్యంతో

TNN 24 Feb 2018, 1:14 pm
భారత్‌తో కేప్‌టౌన్ వేదికగా శనివారం రాత్రి 9.30 నుంచి జరగనున్న చివరి టీ20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ లౌక్యంతో ఆడాలని ఆ జట్టు మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ బెహార్డిన్ సూచించాడు. తొలి టీ20లో భారత్ గెలుపొందగా.. గత బుధవారం రాత్రి జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో మూడు మ్యాచ్‌ల ఈ టీ20 సిరీస్ ప్రస్తుతం 1-1తో సమమవగా.. ఈ రోజు రాత్రి గెలిచిన జట్టే సిరీస్‌ విజేతగా నిలవనుంది. అంతేకాకుండా సుదీర్ఘ సిరీస్‌ని విజయంతో ముగించాలని కూడా ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి.
Samayam Telugu farhaan behardien says batsmen have to play smart in cape town t20
చివరి టీ20.. కొంచెం లౌక్యంతో ఆడండి..!


‘రెండో టీ20 జరిగిన సెంచూరియన్ పిచ్‌పై సిక్సర్లు బాదినట్లు కేప్‌టౌన్‌లో ఆడాలని ప్రయత్నిస్తే బ్యాట్స్‌మెన్‌‌కి నిరాశ తప్పదు. ఎందుకంటే.. కొండల మధ్య మైదానం ఉండటంతో గాలి ఎక్కువగా వీస్తుంటుంది. బంతి గాల్లోకి లేచిన తర్వాత అది సిక్స్‌గా వెళ్లే అవకాశం తక్కువే. కొన్ని బౌండరీ లైన్‌కి సమీపంలో ఉండే ఫీల్డర్ల చేతుల్లో పడొచ్చు. కాబట్టి.. ఎక్కువగా డబుల్స్ తీసేందుకు చొరవ తీసుకోండి. డే/నైట్ మ్యాచ్ కావడంతో బంతి కూడా స్వింగ్‌కి అనుకూలిస్తుంది’ అని సహచరులకి బెహార్దీన్ హెచ్చరికలు జారీ చేశాడు. రెండో టీ20 మ్యాచ్‌లో 189 పరుగుల లక్ష్యాన్ని 18.4 ఓవర్లలోనే ఛేదించిన దక్షిణాఫ్రికా జట్టు మొత్తం 11 సిక్సర్లు కొట్టడం విశేషం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.