ఇంగ్లాండ్తో లీడ్స్ వేదికగా బుధవారం నుంచి ప్రారంభంకానున్న మూడో టెస్టుకి టీమిండియాలో ఒక మార్పు చేయాలని భారత మాజీ క్రికెటర్ ఫరూక్ ఇంజినీర్ సూచించాడు. లార్డ్స్ వేదికగా ఇటీవల ముగిసిన రెండో టెస్టులో 28 ఓవర్లు బౌలింగ్ చేసిన స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కనీసం ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. అయితే.. పేసర్లు రాణించడంతో.. టీమిండియా 151 పరుగుల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది. కానీ.. మూడో టెస్టుకి జడేజా స్థానంలో ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ని ఆడించాలని ఫరూక్ ఇంజినీర్ సూచించాడు. ‘‘లీడ్స్ టెస్టుకి టీమిండియా ప్లాన్ ఏంటో నాకు తెలియదు. కానీ.. ఒకవేళ మబ్బు పట్టిన వాతావరణం ఉంటే..? ముగ్గురు పేసర్లని ఎంచుకోవడం మేలు. కానీ.. స్పిన్నర్ కోటాలో మాత్రం అశ్విన్ని ఆడిస్తే బాగుంటుంది. అప్పుడు బౌలింగ్లో వెరైటీ కనిపిస్తుంది. అశ్విన్ మంచి ఆల్రౌండర్. అతను వరల్డ్క్లాస్ బౌలరే కాదు.. మంచి బ్యాట్స్మెన్ కూడా. ఇంగ్లాండ్పై టెస్టుల్లో అశ్విన్కి ఒక శతకం కూడా ఉంది. అన్నింటికీ మించి అశ్విన్ ఫైటర్.. అతని లాంటి వారు టీమ్లో ఉండాలి’’ అని ఫరూక్ ఇంజినీర్ సూచించాడు.
లార్డ్స్ టెస్టు మొదటి ఇన్నింగ్స్లో 120 బంతులాడి 40 పరుగులు చేసిన రవీంద్ర జడేజా.. రెండో ఇన్నింగ్స్లో 5 బంతులాడి 3 పరుగులకే ఔటైపోయాడు. స్పిన్నర్ మొయిన్ అలీ బౌలింగ్లో బంతి గమనాన్ని ఊహించలేక జడేజా క్లీన్బౌల్డవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.
లార్డ్స్ టెస్టు మొదటి ఇన్నింగ్స్లో 120 బంతులాడి 40 పరుగులు చేసిన రవీంద్ర జడేజా.. రెండో ఇన్నింగ్స్లో 5 బంతులాడి 3 పరుగులకే ఔటైపోయాడు. స్పిన్నర్ మొయిన్ అలీ బౌలింగ్లో బంతి గమనాన్ని ఊహించలేక జడేజా క్లీన్బౌల్డవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.