యాప్నగరం

తప్పిదాలని ఐపీఎల్‌లో దిద్దుకుంటా: ఠాకూర్

న్యూజిలాండ్ గడ్డపై భారత్ జట్టు వన్డే సిరీస్‌లో వైట్‌వాష్‌కి గురవడానికి ఫాస్ట్ బౌలర్ శార్ధూల్ ఠాకూర్ పేలవ బౌలింగ్ కూడా ఓ కారణం. సిరీస్‌లో తేలిపోయిన ఠాకూర్.. ధారాళంగా పరుగులిచ్చేశాడు.

Samayam Telugu 17 Feb 2020, 5:54 pm
న్యూజిలాండ్ గడ్డపై ఇటీవల ముగిసిన టీ20, వన్డేల్లో సిరీస్‌లో చేసిన తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకుంటానని భారత ఫాస్ట్ బౌలర్ శార్ధూల్ ఠాకూర్ ధీమా వ్యక్తం చేశాడు. సిరీస్‌కి ముందే పేసర్ భువనేశ్వర్ గాయపడటంతో.. టీమ్‌లో అవకాశం దక్కించుకున్న ఠాకూర్.. రెండు మ్యాచ్‌ల్లో మినహా తేలిపోయాడు. ముఖ్యంగా.. భారత్ తరఫున సిరీస్‌లో అత్యధిక పరుగులిచ్చిన బౌలర్‌గా పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొన్నాడు. అయితే.. తప్పిదాలు దిద్దుకుని.. ఈ ఏడాది సెప్టెంబరులో జరిగే టీ20 ప్రపంచకప్‌లో ఆడతానని ఠాకూర్ చెప్పుకొచ్చాడు.
Samayam Telugu Shardul Thakur


Read More: IPL 2020లో KKRకి మరో ఆండ్రీ రసెల్..?

‘టీ20 వరల్డ్‌కప్‌లో ఆడాలని ఆశిస్తున్నా. అందుకే.. ఐపీఎల్ 2020 సీజన్‌లో మెరుగ్గా రాణించి.. మళ్లీ ఆత్మవిశ్వాసంతో టీమిండియా తరఫున ఆడతాను. క్రికెట్‌పై నాకు ఉన్న అంకితభావం.. భారత్ జట్టు టీ20 వరల్డ్‌కప్ గెలవడంలో సాయపడుతుంది. ఐపీఎల్‌ తర్వాత శ్రీలంక, జింబాబ్వే‌తో టీ20లని ఆడనున్న టీమిండియా.. వరల్డ్‌కప్ ముంగిట ఆసియా కప్‌లోనూ పోటీపడనుంది. ఈ నేపథ్యంలో.. ఐపీఎల్‌‌లో రాణించడం నాకు చాలా కీలకం’ అని శార్ధూల్ ఠాకూర్ వెల్లడించాడు.

Read More: దక్షిణాఫ్రికాపై గెలిచిన ఇంగ్లాండ్‌కి జరిమానా

టీమిండియా తరఫున ఇప్పటి వరకూ 14 టీ20 మ్యాచ్‌లాడిన శార్ధూల్ ఠాకూర్ 21 వికెట్ల పడగొట్టాడు. అయితే.. అతని బౌలింగ్ ఎకానమీ 8.73గా ఉండటం.. ఆందోళనపరిచే అంశం. మరోవైపు ఐపీఎల్‌లోనూ ఈ పేసర్‌కి మెరుగైన రికార్డ్‌ లేదు. 36 ఐపీఎల్ మ్యాచ్‌లాడిన ఠాకూర్.. 9.04 ఎకానమీతో 36 వికెట్లు మాత్రమే పడగొట్టగలిగాడు. అయితే.. ధోనీ కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అతను ఆడనుండటంతో.. మరింతగా రాటుదేలే అవకాశం ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.