యాప్నగరం

గంగూలీ పిరికివాడా..? అతని తెగింపే వేరు: షోయబ్ అక్తర్

గంటకి 150-160కిమీ వేగంతో సౌరవ్ గంగూలీ ఛాతికి గురిపెట్టి మరీ బంతుల్ని సంధించాను. కానీ.. అతను ఎప్పుడూ భయపడలేదు. ఓపెనర్‌గా వచ్చి మరీ నా బౌలింగ్‌లో పరుగులు రాబట్టాడు -షోయబ్ అక్తర్

Samayam Telugu 11 Jun 2020, 8:15 am
భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ భయమెరుగని ఓ యోధుడని పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ కితాబిచ్చాడు. తాను చూసిన భారత అత్యుత్తమ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అని కొనియాడిన అక్తర్.. అతని కెప్టెన్సీలో టీమిండియా స్వరూపమే మారిపోయిందని కితాబిచ్చాడు. గంగూలీ కెప్టెన్సీలో 2004లో పాక్ పర్యటనకి వచ్చిన భారత్ జట్టు.. అద్భుత ప్రదర్శనని కనబర్చించిందని అక్తర్ గుర్తు చేసుకున్నాడు. ఆ టూర్‌లో పాక్‌ని టెస్టు సిరీస్‌లో 2-1 తేడాతో ఓడించిన టీమిండియా.. ఐదు వన్డేల సిరీస్‌ని 3-2తో చేజిక్కించుకుంది.
Samayam Telugu Sourav Ganguly, Shoaib Akhtar


గంగూలీ ధైర్య సాహసాల గురించి అక్తర్ మాట్లాడతూ ‘‘సౌరవ్ గంగూలీ పిరికివాడు.. నా బౌలింగ్‌ని ఎదుర్కొనేందుకు భయపడతాడని అందరూ ఊహించారు. కానీ.. నా వరకూ నేను ఎదుర్కొన్న ధైర్యవంతుడైన బ్యాట్స్‌మెన్‌ గంగూలీనే. నేను చాలా సందర్భాల్లో అతని ఛాతికి గురిపెట్టి మరీ బంతులు విసిరాను. కానీ.. ఎప్పుడూ నా బౌలింగ్‌ని ఎదుర్కొనేందుకు అతను వెనకడుగు వేయలేదు. ఓపెనర్‌గా వచ్చి మరీ పరుగులు రాబట్టాడు. అతని తెగింపు టీమిండియా కెప్టెన్లలో ఎవరికీ లేదు. ధోనీ ఓకే.. కానీ.. భారత్ జట్టుని క్లిష్టపరిస్థితుల్లో నడిపించిన ఘనత గంగూలీకే దక్కుతుంది’’ అని అక్తర్ వెల్లడించాడు.

భారత్ తరఫున 113 టెస్టులు, 311 వన్డేలాడిన సౌరవ్ గంగూలీ.. 38 సెంచరీలు నమోదు చేశాడు. కెప్టెన్‌గా సాహసోపేత నిర్ణయాలకి గంగూలీ పెట్టింది పేరు. ముఖ్యంగా.. మహేంద్రసింగ్ ధోనీని మిడిలార్డర్ నుంచి మూడో స్థానానికి ప్రమోట్ చేయడం అతని కెప్టెన్సీ సామర్థ్యానికి మచ్చుతునక. ఆ తర్వాత ధోనీ పవర్ హిట్టర్‌గా వెలుగులోకి రావడం.. టీమిండియా కెప్టెన్‌ కావడం కూడా చకచకా జరిగిపోయాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.