యాప్నగరం

Ind vs Aus: మెరిసిన షా, కోహ్లి.. భారత్ 358‌కి ఆలౌట్

ఓపెనర్ కేఎల్ రాహుల్ (3: 18 బంతుల్లో) పేలవంగా ఔటై నిరాశపరచగా.. ఆ తర్వాత వచ్చిన చతేశ్వర్ పుజారాతో కలిసి ఇన్నింగ్స్‌ కొనసాగించిన పృథ్వీ షా వరుస బౌండరీలతో ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు.

Samayam Telugu 30 Nov 2018, 4:29 pm
సిడ్నీ వేదికగా క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్ టీమ్‌తో ఈరోజు ఆరంభమైన ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అర్ధశతకాలతో మెరిశారు. ఓపెనర్ పృథ్వీ షా (66: 69 బంతుల్లో 11x4), కెప్టెన్ విరాట్ కోహ్లి (64: 87 బంతుల్లో 7x4, 1x6), చతేశ్వర్ పుజారా (54: 89 బంతుల్లో 6x4) అజింక్య రహానె (56 రిటైర్డ్ ఔట్: 123 బంతుల్లో 1x4), హనుమ విహారి (53: 88 బంతల్లో 5x4, 1x6) అర్ధశతకాలు బాదడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 92 ఓవర్లలో 358 పరుగులకి ఆలౌటైంది. నాలుగు రోజుల ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌ వర్షం కారణంగా.. నిన్న తొలిరోజు ఆట రద్దవగా.. ఈరోజు భారత్ పరుగుల మోత మోగించింది.
Samayam Telugu Sydney : Indias Prithvi Shaw misses a sweep shot that will have him bowled out ...
India's Prithvi Shaw misses a sweep shot that will have him bowled out for 66 runs during their tour cricket match against Cricket Australia XI in Sydney. AP/PTI(


టాస్ గెలిచిన క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్ టీమ్ కెప్టెన్ శామ్ వైట్‌మాన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇటీవల ఆసీస్‌పై టీ20 సిరీస్‌లో ఘోరంగా విఫలమైన కేఎల్ రాహుల్.. పృథ్వీ షా‌తో కలిసి భారత్ ఇన్నింగ్స్ ఆరంభించాడు. కానీ.. ఐదో ఓవర్‌లోనే రాహుల్ (3: 18 బంతుల్లో) పేలవంగా ఔటై నిరాశపరచగా.. ఆ తర్వాత చతేశ్వర్ పుజారాతో కలిసి ఇన్నింగ్స్‌ కొనసాగించిన పృథ్వీ షా వరుస బౌండరీలతో ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఈ క్రమంలోనే అర్ధశతకం పూర్తి చేసుకున్న పృథ్వీ షా.. జట్టు స్కోరు 96 వద్ద ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కోహ్లి, హనుమ విహారి, రోహిత్ శర్మ (40: 55 బంతుల్లో 5x4, 1x6) దూకుడుగా ఆడినా.. రహానె మాత్రం అతి నెమ్మదిగా బ్యాటింగ్ చేశాడు. అతను 123 బంతుల్లో చేసిన పరుగులు 56కాగా.. కేవలం ఒకే ఒక ఫోర్ మాత్రమే కొట్టగలిగాడు. ఆఖర్లో రిషబ్ పంత్ (11 నాటౌట్: 17 బంతుల్లో 1x4) నిలకడగా ఆడేందుకు ప్రయత్నించినా.. అశ్విన్ (0), మహ్మద్ షమీ (0), ఉమేశ్ యాదవ్ (0) వరుసగా డకౌటవడంతో భారత్ 358‌కే పరిమితమైంది.

డిసెంబరు 6 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్టుల సిరీస్ మొదలుకానుంది.

భారత్ టెస్టు జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), మురళీ విజయ్, లోకేశ్ రాహుల్, పృథ్వీ షా, చతేశ్వర్ పుజారా, ఆజింక్య రహానె, హనుమ విహారి, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, పార్థివ్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.