క్రికెట్ ప్రపంచంలో అత్యుత్తమ మ్యాచ్ ఫినిషర్గా పేరు తెచ్చుకున్న ధోనీ.. ఇటీవల మ్యాచ్ల్ని మునుపటిలా ముగించలేకపోవడంతో వరుసగా విమర్శలు చెలరేగుతున్నాయి. తాజాగా వెస్టిండీస్తో ముగిసిన నాలుగో వన్డేలోనూ దాదాపు చివరి వరకు ధోనీ క్రీజులో ఉన్నా.. భారత్కి విజయాన్ని అందించలేకపోయాడు. ఈ మ్యాచ్లో ధోనీ (54 : 114 బంతుల్లో 1x4) చేసిన అర్ధశతకం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసింది. అయితే ఈ వెస్టిండీస్ పర్యటనలో ధోనీ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు.
క్రికెట్లోని అన్ని ఫార్మాట్లలో కలిపి ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ గిల్క్రిస్ట్ చేసిన 15,461 పరుగుల రికార్డును ధోనీ బద్ధలుకొట్టాడు. ఈ జాబితాలో శ్రీలంక మాజీ వికెట్ కీపర్ కుమార సంగక్కర దాదాపు 25వేల పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. తాజాగా ధోనీ వన్డేల్లో 9496, టెస్టుల్లో 4876, టీ20ల్లో 1209 పరుగులు చేసి మొత్తం 15,581తో రెండో స్థానాన్ని చేజిక్కించుకున్నాడు. ‘నా రికార్డుని కనుమరుగు చేసినందుకు అభినందనలు ధోని. నీ జోరు ఇలానే కొనసాగించు’ అంటూ గిల్క్రిస్ట్ సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు.
క్రికెట్లోని అన్ని ఫార్మాట్లలో కలిపి ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ గిల్క్రిస్ట్ చేసిన 15,461 పరుగుల రికార్డును ధోనీ బద్ధలుకొట్టాడు. ఈ జాబితాలో శ్రీలంక మాజీ వికెట్ కీపర్ కుమార సంగక్కర దాదాపు 25వేల పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. తాజాగా ధోనీ వన్డేల్లో 9496, టెస్టుల్లో 4876, టీ20ల్లో 1209 పరుగులు చేసి మొత్తం 15,581తో రెండో స్థానాన్ని చేజిక్కించుకున్నాడు. ‘నా రికార్డుని కనుమరుగు చేసినందుకు అభినందనలు ధోని. నీ జోరు ఇలానే కొనసాగించు’ అంటూ గిల్క్రిస్ట్ సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు.