యాప్నగరం

క్రికెట్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు

మనం ఎంతగానో ప్రేమించే క్రికెట్ ఆటను తొలుత ఎవరు, ఎక్కడ ఆడారు? క్రికెట్ ఆటను కనిపెట్టింది ఎవరో మీకు తెలుసా!

Samayam Telugu 25 Jan 2020, 6:36 pm
భారతదేశంలో క్రికెట్ అంటే అందరికీ ఎంత ఇష్టమో తెలిసిందే. మనలో చాలా మంది క్రికెట్ మ్యాచ్ ఉందంటే, మిగిలిన పనులను ప్రక్కన పెట్టి టీవీలకు అతుక్కుపోతాము. అయితే మనం ఎంతగానో అభిమానించే ఈ క్రికెట్ ఆటను తొలుత ఎవరు, ఎక్కడ ఆడారు? క్రికెట్ ఆటను కనిపెట్టింది ఎవరో మీకు తెలుసా!
Samayam Telugu cricket

  1. మొదటి క్రికెట్ మ్యాచ్ ఎప్పుడు జరిగింది?
    ప్రపంచంలో మొట్టమొదటి ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ 1844 లో US, కెనడా జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్ న్యూయార్క్ నగరంలో St. జార్జి క్రికెట్ క్లబ్ గ్రౌండ్‌లో ఆడారు.
  2. మొదటి అధికారిక టెస్ట్ మ్యాచ్ ఎప్పుడు జరిగింది?
    మొదటి అధికారిక టెస్ట్ మ్యాచ్ 1877 మార్చ్ 15 నుండి 19 తేదీల మధ్య జరిగింది. ఆ మ్యాచ్ ఆస్ట్రేలియా వేదికగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగగా ఆస్ట్రేలియా జట్టు 45 పరుగుల తేడాతో గెలుపొందింది.
  3. క్రికెట్ పితామహుడు ఎవరు?
    ఇంగ్లాండ్ దేశస్థుడైన W. G. గ్రేస్‌ను క్రికెట్ పితామహుడుగు పరిగణిస్తారు. తను క్రికెట్ ఆటలో ఒక ఆల్ రౌండర్.
  4. క్రికెట్‌ను ఎవరు కనుగొన్నారు?
    1646 వ సంవత్సరంలో US లోని కెంట్ నగరంలో మొదటి అనధికారిక క్రికెట్ మ్యాచ్ ఆడడం జరిగింది. 1700 వ శతాబ్దంలో ఇంగ్లాండ్ దేశం, క్రికెట్‌ను ఎక్కువ దేశాలకు పరిచయం చేసింది. ఇంగ్లాండ్‌కు చెందిన విలియం గోల్డ్‌విన్ 1706 వ సంవత్సరంలో క్రికెట్ ఆటను ఎలా ఆడాలో చెప్తూ మొదటి ప్రచురణను విడుదల చేసారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.