యాప్నగరం

LPL 2020 ప్రారంభానికి ముందే మ్యాచ్ ఫిక్సింగ్ ప్రయత్నాలు.. అదుపులో మాజీ క్రికెటర్!

లంక ప్రీమియర్ లీగ్ ప్రారంభానికి ముందే భారీ ఫిక్సింగ్ కోసం ప్రయత్నాలు జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఫిక్సింగ్‌కు ప్రయత్నించిన మాజీ క్రికెటర్‌ను విదేశాల్లో విచారిస్తున్నట్లు సమాచారం.

Samayam Telugu 26 Nov 2020, 12:20 pm
శ్రీలంక క్రికెట్ బోర్డ్ ఎన్నో ఆశలతో లంక ప్రీమియర్ లీగ్‌ను ప్రారంభిస్తోంది. 8 ఏళ్ల క్రితం శ్రీలంక ప్రీమియర్ లీగ్ ప్రారంభించినప్పటికీ.. విజయవంతం కాకపోవడంతో... ఎల్‌పీఎల్‌ను విజయవంతం చేయాలని ఆ దేశం భావిస్తోంది. కానీ ఎల్‌పీఎల్ ప్రారంభానికి ముందే.. ఫిక్సింగ్ ఆరోపణలు వెలుగు చూశాయి. మ్యాచ్ ఫికింగ్స్‌కు పాల్పడాలని కొలంబో కింగ్స్ ఆటగాణ్ని శ్రీలంక మాజీ క్రికెటర్ ఒకరు సంప్రదించారు.
Samayam Telugu 1


ఈ విషయం ఐసీసీకి చేరడంతో.. ఐసీసీ అవినీతి వ్యతిరేక విభాగం రంగంలోకి దిగింది. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై విచారణ ప్రారంభించింది. ఫిక్సింగ్ కోసం ప్రయత్నించిన మాజీ క్రికెటర్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నాడని శ్రీలంకకు చెందిన లంకదీప అనే వార్తాపత్రిక వెల్లడించింది. ఐస్‌లాండ్ క్రికెట్ వెల్లడించిన వివరాల ప్రకారం ఫిక్సింగ్ కోసం ప్రయత్నించిన శ్రీలంక మాజీ క్రికెటర్‌ను విచారిస్తున్నారని తెలుస్తోంది.

టోర్నీ ప్రారంభానికి ముందే ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో.. ఇక నుంచి ఆటగాళ్ల కదలికలను శ్రీలంక, ఐసీసీకి చెందిన యాంటీ కరప్షన్ అధికారులు నిశితంగా గమనించనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.