యాప్నగరం

ఏడుగురితో బీసీసీఐ కమిటీ ఏర్పాటు..!

మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీకి కూడా బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) అధ్యక్షుడి హోదాలో చోటు దక్కింది.

TNN 27 Jun 2017, 3:58 pm
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)లో పారదర్శకత కోసం లోధా కమిటీ సూచించిన సంస్కరణల అమలుపై విశ్లేషించేందుకు మంగళవారం బీసీసీఐ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లాని కమిటీ ఛైర్మన్‌గా నియమిస్తూ.. మరో ఆరుగురి సభ్యులకి చోటు కల్పించింది. ఇందులో మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీకి కూడా బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) అధ్యక్షుడి హోదాలో చోటు దక్కింది.
Samayam Telugu formation of special committee
ఏడుగురితో బీసీసీఐ కమిటీ ఏర్పాటు..!


గత ఏడాది లోధా సంస్కరణల అమలుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఎంత త్వరగా.. మెరుగ్గా బోర్డులో అమలు చేయవచ్చునో ఈ కమిటీ విశ్లేషించి నివేదికను జులై మూడో వారంలోగా సమర్పించనుంది. సోమవారం జరిగిన బీసీసీఐ సర్వసభ్య సమావేశంలో కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించగా.. తాజాగా సభ్యుల నియామకం పూర్తయింది.

కమిటీ సభ్యులు:
1. రాజీవ్ శుక్లా (ఛైర్మన్)
2. సౌరవ్ గంగూలీ
3. టి.సి. మాథ్యూ
4. నబా భట్టాఛార్జీ
5. జై సాహ్
6. అనిరుధ్ చౌదరి (బీసీసీఐ తాత్కాలిక కోశాధికారి) 7. అమితాబ్ చౌదరి (బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శి)

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.