యాప్నగరం

టీమిండియా కెప్టెన్సీ విభజనపై స్పందించిన టామ్ మూడీ

ఐపీఎల్‌లో కెప్టెన్‌గా రోహిత్ శర్మ నాలుగు సార్లు టైటిల్ గెలవడం ద్వారా నాయకత్వ సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు. కానీ.. కోహ్లీ కనీసం ఒక్క ఐపీఎల్ టైటిల్‌ని కూడా ఇప్పటి వరకూ గెలవలేదు.

Samayam Telugu 10 Jul 2020, 6:50 pm
భారత క్రికెట్‌లో కెప్టెన్సీ విభజనపై గత ఏడాదికాలంగా చర్చ జరుగుతోంది. 2017లో వన్డే, టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి మహేంద్రసింగ్ ధోనీ తప్పుకోగా.. విరాట్ కోహ్లీ పూర్తిస్థాయి కెప్టెన్‌గా మారాడు. కానీ.. అతని కెప్టెన్సీలో టీమిండియా కనీసం ఒక్క ఐసీసీ టైటిల్‌ని కూడా గెలవలేకపోయింది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాక్ చేతిలో టీమిండియా ఓడిపోగా.. 2019 వన్డే ప్రపంచకప్‌ నుంచి సెమీస్‌లోనే ఓడి ఇంటిబాట పట్టింది. దాంతో.. టెస్టులు, వన్డే కెప్టెన్‌గా విరాట్ కోహ్లీని కొనసాగించి.. టీ20లకి మాత్రం రోహిత్ శర్మని కెప్టెన్‌ని చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్స్ వినిపిస్తున్నాయి.
Samayam Telugu Virat Kohli, Rohit Sharma
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ


ఇంగ్లాండ్‌ వన్డే, టీ20 జట్లకి ఇయాన్ మోర్గాన్ కెప్టెన్‌కాగా.. టెస్టుల్లో జో రూట్ ఆ జట్టుని నడిపిస్తున్నాడు. అలానే ఆస్ట్రేలియా టెస్టు టీమ్‌కి టిమ్ పైనీ కెప్టెన్‌కాగా.. వన్డే, టీ20 జట్లకి అరోన్ ఫించ్ కెప్టెన్. ఇలా చాలా దేశాలు కెప్టెన్సీ విభజనతో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాయి. కానీ.. భారత్‌లో కెప్టెన్సీ విభజన అంత సులువు‌కాదని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్ మూడీ అభిప్రాయపడ్డాడు.

‘‘ఇంగ్లాండ్‌లో కెప్టెన్సీ విభజన సులువుగా జరగడానికి కారణం.. ఇయాన్ మోర్గాన్ టెస్టు ప్లేయర్ కాదు. అతను పక్కా టీ20, వన్డే బ్యాట్స్‌మెన్. కానీ.. భారత్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మూడు ఫార్మాట్లలోనూ ఆడుతున్నారు. కాబట్టి.. ఒకవేళ కోహ్లీ నుంచి టీ20 కెప్టెన్సీని తప్పిస్తే..? అతను సుదీర్ఘకాలం క్రికెట్‌లో కొనసాగగలడు. ఎందుకంటే.. మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ అంటే ఒత్తిడితో కూడుకున్న అంశం. భారత్‌లో ఆ ఒత్తిడి మరింత ఎక్కువగా ఉంటుంది’’ అని టామ్ మూడీ వెల్లడించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.