యాప్నగరం

ధోనీని తప్పించాలని 2012లోనే స్కెచ్

భారత్‌కి 28 ఏళ్ల తర్వాత 2011లో వన్డే ప్రపంచకప్‌‌ని అందించిన మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీని తర్వాత ఏడాదే నాయకత్వ బాధ్యతల నుంచి

TNN 27 Oct 2017, 9:53 am
భారత్‌కి 28 ఏళ్ల తర్వాత 2011లో వన్డే ప్రపంచకప్‌‌ని అందించిన మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీని తర్వాత ఏడాదే నాయకత్వ బాధ్యతల నుంచి పక్కకి తప్పించాలని సెలక్టర్లు నిర్ణయించారట. ఈ విషయాన్ని ప్రముఖ పాత్రికేయుడు రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ తాజాగా ‘డెమోక్రసీస్‌ ఎలెవన్‌ : ద గ్రేట్ ఇండియన్ క్రికెట్ స్టోరీ’ పుస్తకం ద్వారా వెల్లడించారు. అయితే.. ఆ సమయంలో బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న శ్రీనివాసన్ ఈ నిర్ణయాన్ని తిరస్కరించడంతో సెలక్టర్లు వెనక్కి తగ్గారట. 2014, డిసెంబరులో టెస్టులకి రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ.. ఈ ఏడాది జనవరిలో టీ20, వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి పక్కకి తప్పుకున్న విషయం తెలిసిందే.
Samayam Telugu former bcci president n srinivasan admits shielding ms dhoni heres what happened
ధోనీని తప్పించాలని 2012లోనే స్కెచ్


‘ధోనీ సారథ్యంలో అద్భుతంగా ఆడిన భారత్ జట్టు 2011లో ప్రపంచకప్ గెలిచింది. ఆ తర్వాత ఏడాదే అతడిని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించాలని మొహిందర్ అమరనాథ్ అధ్యక్షుడిగా ఉన్న సెలక్షన్ కమిటీ నిర్ణయించింది. కానీ.. బీసీసీఐ అధ్యక్షుడి హోదాలో నేను ఆ నిర్ణయాన్ని తిరస్కరించాను. అలా చేయడం పక్షపాతం అని మీరు అనుకోవచ్చు. కానీ.. 2007‌లో టీ20 ప్రపంచకప్, 28 ఏళ్ల తర్వాత వన్డే ప్రపంచకప్‌ని భారత్‌కి అందించిన గొప్ప కెప్టెన్‌కి నేనిచ్చిన గౌరవం అదేనని నా నమ్మకం’ అని శ్రీనివాసన్ ఆ పుస్తకంలో తన అభిప్రాయన్ని స్పష్టం చేశారు. 2013లో తనపై ఫిక్సింగ్ ఆరోపణలు రావడంపై ధోనీ కూడా ఈ పుస్తకం ద్వారా స్పందించాడు. ‘ఒకవేళ నేను బాగా ఆడకపోతే విమర్శించండి.. తప్పులేదు. కానీ.. ఫిక్సింగ్‌కి పాల్పడినట్లు ఆరోపించకండి. క్రికెట్ వల్లే నేను ఈ స్థాయికి ఎదిగాను. అప్పట్లో నాపై ఆరోపణలు మీడియాలో మరీ బాధించేలా వచ్చాయి’ అని ధోనీ వెల్లడించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.